Skip to main content

ఉరవకొండలో చట్టవిరుద్ధ బార్‌ కలకలం: అధికారుల 'లంచాల'పై తీవ్ర ఆరోపణలు

 లై సెన్స్ కళ్యాణ దుర్గంమున్సిపాలిటీలో లో.. నిర్వహణ ఉరవకొండ గ్రామ పంచాయితీ లో 

-ఊరురా బెల్ట్ షాపులు, నిర్వాహకులదే రాజ్యమా?

నో డాకుమెంట్స్, నో నోటిఫికేషన్స్
ఉరవకొండ: అనంతపురం జిల్లా పరిధిలోని ఉరవకొండలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఎటువంటి చట్టపరమైన అనుమతులు (జీఓ) లేకుండా, కేవలం ఎక్సైజ్ అధికారుల అండదండలతో, భారీ లంచాలతో ఈ బార్ నడుస్తోందని స్థానిక వ్యాపారులు, పౌరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామంతో తమ వ్యాపారాలు దెబ్బతిని, తమ జీవనం ప్రమాదంలో పడిందని స్థానిక మద్యం షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్‌ నిబంధనలకు విరుద్ధంగా బార్‌ నిర్వహణ ఎక్సైజ్ చట్టాల ప్రకారం, గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా బార్‌ను ఏర్పాటు చేయాలంటే మంత్రివర్గ స్థాయి ఆమోదంతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) తప్పనిసరి. అయితే, ఉరుకొండలో గత నాలుగు రోజులుగా నడుస్తున్న ఈ కొత్త బార్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక పత్రాలు గానీ, నోటిఫికేషన్లు గానీ లేవని స్థానిక వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారులు ప్రశ్నించగా, పైస్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు మాత్రమే వచ్చాయని ఎక్సైజ్ అధికారులు సమాధానమిచ్చినట్లు సమాచారం. అంతేకాక, కల్యాణదుర్గం పరిధిలోని మద్యం స్టాక్‌ను ఇక్కడికి తరలించి అక్రమంగా విక్రయాలు జరుపుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోతున్న వ్యాపారులు ఈ అక్రమ బార్‌తో ఇప్పటికే లక్షలాది రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేస్తున్న స్థానిక రెండు మద్యం షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయి. "కొత్త బార్‌ రాకతో మా విక్రయాలు ఒక్కసారిగా 50–60 శాతం పడిపోయాయి. ఇలాగే కొనసాగితే మా కుటుంబాలు, మాతో భాగస్వాములుగా ఉన్న అనేక మంది జీవనం నాశనమవుతుంది" అని వ్యాపారులు వాపోయారు. ఈ రెండు షాపులపై ఆధారపడిన మొత్తం 70 మందికి పైగా భాగస్వాముల పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయని వారు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక మద్యం మాఫియా మరియు కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ లో ఏళ్ళ తరబడి ఉంటూ ఆర్ధికంగా చితికి పోయామని అయితే రెండు మూడు షాపులు పొందిన వ్యక్తులు /స్థానికేతరులు పెత్తనం చేలాయిండం పై సర్వత్రా విమర్శలు వెలువెత్తు తున్నాయి.ఈ కొత్త బార్‌ను నిర్వహిస్తున్నారని, వీరి ప్రభావం ఇప్పటికే 40 గ్రామాలకు విస్తరించిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. స్పందించని ఉన్నతాధికారులు: మీడియా ద్వారా మొర చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఈ బార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మూడు రోజులుగా ఉన్నతాధికారులను సంప్రదించినా ఎటువంటి స్పందన రాలేదని బాధితులు పేర్కొన్నారు. తమ గోడును వినిపించుకోవడానికి చివరికి మీడియాను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. తక్షణమే ఈ చట్టవిరుద్ధ బార్‌ను మూసివేయించి, తమ వ్యాపారాలను కాపాడాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...