Skip to main content

జనగణనలో కుల గణన చేపట్టాలి



 

అనంతపురం:

  జన గణనలో కుల గణన చేపట్టాలని బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని సిపిఐ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షతన ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సలహాలు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఐదు నుండి 15% మధ్యలో ఉన్న అగ్రకులాల నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కానీ 50 నుంచి 70 శాతం మధ్యలో ఉన్న బీసీ కులాల నాయకులు చిన్నచిన్న పోస్టులకు అగ్రకులాల వారిని అడుక్కున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు గత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇటేవలే తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టడం వలన ఏఏ కులాలు ఎంతమంది ఉన్నది అని లెక్క తేల్చింది అందుకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు తదిపర గవర్నర్ ను కలిసి ఆమోదించవలసిందిగా కోరారు.. గవర్నర్ కూడా దాన్ని ఆమోదించడం జరిగిందని తెలిపారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు బీసీలను ఎన్నికల సమయంలో జపం చేస్తూనే మరోవైపు కుల గణన చేపట్టడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వెనుకబడిన కులాల హక్కులను సాధించుకోవడానికి బీసీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కుల సంఘాలను ఆహ్వానించి రౌండ్ టేబుల్ ద్వారా కార్యాచరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు తక్షణమే జనగణలో కుల గణన చేపట్టి స్థానిక సంస్థలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.. ఈ అంశం పైన అక్టోబర్ 4వ తేదీన అనంతపురం నగరంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాజీ పార్లమెంట్ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య రిటైర్డ్ జడ్జ్ కిష్టప్ప మాజీ మేయర్ రాగే పరశురాం సిపిఎం పార్టీ నాయకులు బాలరంగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సాకే శంకర్ బీసీ సంఘాల రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకే హరి బీఎస్పీ నాయకులు గోవిందు ఆర్ఎస్పి నాయకులు శ్రీరాములు కురుబ సంఘం నాయకులు శివ బాల లింగమూర్తి బోరంపల్లి ఆంజనేయులు వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు బ్రహ్మయ్య కొడెర్ల సంఘం నాయకులు గోపాలు కృష్ణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సురేంద్ర విష్ణు ఆర్ఇఎఫ్ నాయకులు నాగభూషణం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున రాజారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు శ్రీరాములు రామకృష్ణ గోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందు లింగమయ్య రమణ సంతోష్ కుమార్ రాజేష్ రమేష్ మల్లికార్జున నాగార్జున కుళ్లాయిస్వామి పెద్దయ్య పార్వతీ ప్రసాద్ చేన్నప్పయాదవ్ సిపిఐ నాయకులు అల్లిపీరా ఎల్లుట్ల నారాయణస్వామి నరేష్ చిత్తర్చేడు రామాంజనేయులు జానకి తదితరులు పాల్గొన్నారు*

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...