పూతలపట్టు సెప్టెంబర్ : ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమితులైన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ గాని మదనపల్లి కేంద్రంలో ఉన్న ఎంజి గ్రాండ్ నందు పూతలపట్టు జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై పోస్ట్ మహేష్ గారిని ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమించడం శుభసూచకమని భవిష్యత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా, పరిసర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మహేష్ గారు రెట్టింపు స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి,అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని,ఇలాంటి యువ నాయకుడికి అవకాశం కల్పించడం హర్షణీయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య,జిల్లా నాయకులు ఎం మహేష్ స్వేరో,యాదమరి మండల అధ్యక్షులు కుమార్,యాదమరి మండల కార్యదర్శి వేముల పవన్,తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు చిన్న,అజిత్ శ్రీరాముల,అనిల్ కుమార్,ప్రభాకర్,టీ ఎన్ ఎస్ ప్రసాద్,త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment