Skip to main content

మంత్రి తీరుపై సాలూరు గిరిజన నాయకులు మండిపాటు బాధలు చెప్పేందుకు వస్తే అరెస్టులు చేయిస్తారా అంటూ ప్రశ్న

సాలూరు :-రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీరు అన్యాయంగా ఉందని, తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన నిరుద్యోగులను అరెస్టులు చేయించటం దారుణమని ఆదివాసీ గిరిజన నాయకులన్నారు. జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొండగొర్రె ఉదయ్ తో పాటు సాలూరు మండల ఏజేఏసీ ప్రెసిడెంట్ నిమ్మక అన్నారావు, మండల జనరల్ సెక్రటరీ సుర్ల ప్రవీణ్, ఆదివాసీ వికాస పరిషత్ ట్రెజరర్ మచ్చ భీమారావు తదితరులు ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. శనివారం సాలూరు జరిగిన గిరిజన నిరుద్యోగుల అరెస్టులు అన్యాయమన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం ఉదయం పాడేరు, అరకు ప్రాంతాల నుండి కొంతమంది గిరిజన నిరుద్యోగులు మంత్రి సంధ్యారాణిని కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు రాగా వారిని తన ఇంటికి రానివ్వ కుండా చుట్టూ పోలీసులను కాపలా పెట్టారని, అంతేకాకుండా అరెస్టులు చేయించారన్నారు. సంధ్యారాణి గారు ఎన్నికల ముందు నేను మీ గిరిజన ఆడపడుచుని నాకు ఓటు వేసి గెలిపించండి అని కోరారని, అధికారంలోకి వచ్చాక పట్టించు కోవడం లేదన్నారు. తమ బాధలు, అన్యాయాన్ని వివరించే వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వస్తే అరెస్టులు చేయించటం అన్యాయమన్నారు. ఈ సందర్భంగా జగ్గుదొర వలస గిరిజనులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసారు. ఏజన్సీ ధ్రువ పత్రాల ఇప్పిస్తానని, ఏజన్సీ గిరిజన గ్రామాలను షెడ్యూల్డు గ్రామాలుగా ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చి మార్చిపోయారన్నారు. గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డిఎస్సీని నిర్వహించేలా చేస్తానని మాట ఇచ్చారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ గిరిజన నిరుద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో మాజీ డిప్యూటీ సిఎం ఉప రాజన్న దొర ఇంటికి ఇదే విధంగా సమస్యలను చెప్పుకునేందుకు పలు మార్లు వెళ్ళటం జరిగిందన్నారు. ఆయన ఎపుడూ అరెస్టులు చేయించలేదని, పోలీసులను ఉసి గొలప లేదన్నారు. రైతు కూలీ సంఘం నాయకుడు ఊయక ముత్యాలు ఐదు వందల మందితో దొర గారు లేనప్పుడు అతని ఇంటికి వచ్చి నిరసన తెలిపారని, అయినప్పటికీ వారి పట్ల దురుసుగా వ్యవహరించవద్దని పోలీసులకు చెప్పటంతో పాటు ఇంటి వద్ద ఉన్న తమ మనుష్యులకు చెప్పి ఆందోళన కారులకు మంచి నీరు, మజ్జిగ ఇప్పించారని గుర్తుచేసారు. అంతేకాకుండా 2020డిసెంబర్ 21న సిపిఎం నాయకులు పి. అప్పల నరసయ్య, సీదరపు అప్పారావుల ఆధ్వర్యంలో మూడు వేలకు పైగా గిరిజనులు రాజన్న దొర ఇంటికి విచ్చేయగ, ఆ సమయంలో ఆయన బయటకు వెళ్లారని, అప్పుడు కూడా ఇదే విధంగా పోలీసులకు చెప్పారన్నారు. తదుపరి వారంతా రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేస్తుండగా, క్యాంప్ నుండి వస్తున్న రాజన్న దొర నేరుగా వారి వద్దకు వెళ్లి, వారు చెప్పినవి విని, తన అభిప్రాయాన్ని, తమ ప్రభుత్వం అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారన్నారు. అంతే తప్ప పోలీసులను ఉపయోగించి నిర్భందించటం, అరెస్టులు చేయించటం చెయ్యలేదన్నారు. గిరిజనులు శాంతియుతంగా తమ బాధలు చెప్పుకునేందుకు విచ్చేస్తే అరెస్టులు చేయించటం మంత్రి సంధ్యారాణికి తగదన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...