పుత్తూరు:- ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, పుత్తూరు వారి చే పాలమంగళం, సచివాలయం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో దినకర్ గాండ్ల ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడమైనది. 150మంది రోగులకు కంటి పరిక్షలు, బ్లడ్, షుగర్, ఎముకలు,ఈసీజీ పరీక్షలు చేసి 45000/-విలువ గల మందులు ఉచితంగా ఇవ్వడమైనది.కంటి పరీక్షలు చేయించు కొన్న వారిలో 27 మందికి శుక్లలు వల్ల కంటి ఆపరేషన్ కి సెలెక్ట్ చేయడమైనది. ఉషోదయ వాకర్స్ అసోసియేయిన్ వ్యవస్థాపక అధ్యక్షులు కోనేటి రవిరాజు, కార్యదర్శి రామ్ మోహన్ వర్మ, పాల్గొని క్యాంపు నిర్వహించినారు. ఆస్టర్ నారాయణ ద్రి హాస్పిటల్ డాక్టర్ అర్జున్, పి. ఆర్. ఓ. మౌళి మరియు సిబ్బంది పాల్గొన్నారు.వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ బాలకృష్ణ, పి. ఆర్. ఓ వెంకటేష్, సంధ్యా పాల్గొన్నారు. ఈ క్యాంపు కు భాస్కర్ నాయుడు, ఉపసర్పంచ్, నరసింహాశెట్టి,రవి నాయుడు, జనార్దన్ రెడ్డి, సెందిల్, లీలావతి మరియు గ్రామ సభ్యులు పాల్గొని మెడికల్ క్యాంపు దిగ్విజయముగా జరిపించిన్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment