Skip to main content

మారిన ప్రభుత్వం.. మారని అధికారుల తత్త్వం

ట్రా



ఫిక్ లోఆవులతో అవస్థలు.ప్రమాదాలకు హేతువులు

 -నిబంధనలకు నీళ్లు పట్టించుకోని పోలీసులు- సోమవారాలు, పండగలపూట ట్రాఫిక్ జామ్

- రోడ్డు మీదే అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్మా 

 ట్రాఫిక్ లో ఆవులు ప్రమాదాలకు హేతువులుగా మారాయని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు వారం రోజుల క్రితం బూదగవి గ్రామ సమీపంలో అడ్డొచ్చినవో బర్రెను ఢీకొని ఓ విలేకరి మృతి చెందారు. పట్టణంలో పట్టణ శివార్లలో అడుగడుగునా ఆవులు వాహన చోదకులకు ప్రమాదహేతువులుగా మారాయి . వీటిని నియంత్రించే దిశగా తక్షణమే వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు.

 ఉరవకొండ పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. నిబంధనలకు నీళ్లు వదిలిన పోలీసులు పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు సర్వత్రా వెళ్ళు వెత్తుతున్నాయి. రిక్రియేషన్ క్లబ్బు పక్కన ఓ మెకానిక్ ఏకంగా సగం రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేస్తూ మరమ్మత్తులు చేస్తూ ప్రధాన ప్రతిబంధం కంగా మారాడు. ఇది ప్రధాన అన్నికార్యాలయాలకు వెళ్లే రహదారి. అయితే పోలీసులు నియంత్రణ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నిత్యం వాహన రాకపోకులకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.

 ఇక గడియార స్తంభం చుట్టూ చిన్నాచితకా,వ్యాపారస్తులు రోడ్డు మీదనే అమ్మకాలు కొనుగోలు సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గడియార స్తంభం రహదారి అంచున వ్యాపారస్తులు కాయగూరలు విక్రయిస్తున్నారు. గంపల్లోనే కాకుండా పూలు, పళ్ళు తోపుడుబండ్లపై విక్రయిస్తూ ట్రాఫిక్కు నిత్యం అంతరాయం కలిగిస్తున్నారు. తెలుగు తల్లి విగ్రహం చుట్టూ గడియార స్తంభం చుట్టూ ఆకుకూరల వ్యాపారులు రహదారి అంచున విక్రయిస్తూ వాహన ప్రమాదాలకు కారకలవుతున్నారు. ఇదే మార్గంలో చర్చి ప్రాంతం వరకు దారి పొడుగునా తోపుడుబండ్లు దర్శనమిస్తాయి. వచ్చి పోయే వాహనాలకు హారన్ మోగించిన పట్టించుకోరు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోతోంది. క్లియర్ కావాలంటే, చేయాలంటే గంటలు తరబడి సమయం వృథా అవుతోంది. టవర్ క్లాక్ ప్రాంతంలోజోరుగా స్వీట్స్ విక్రయాలు, ఫ్రూట్స్ విక్రయాలు తోపుడుబండ్ల,విక్రయాలతో వాహన చోదకులు బేంబేలు ఎత్తిపోతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా కాయగూరల మార్కెట్ సౌకర్యం లేక వారు తోపుడు బండ్ల పై,రోడ్లపై యాతేచ్చగా విక్రయాలు సాగిస్తున్న అడిగే వారే లేకపోయారు. గతంలో కాయగూరల వ్యాపారాలకు కేటాయించిన స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసుకొని అందులో మండి వ్యాపారం సాగిస్తున్నారు.. చిల్లర మల్లర వ్యాపారస్తులు,రోడ్లపై విక్రయాలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది.అటు పంచాయతీ పాలకవర్గం,అధికారులు గానీ,పోలీసులు గానీజోక్యం కలిగించుకుంటే సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. అయితే వారు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో ట్రాఫిక్ సమస్య జటి లమవుతోంది.. ఇక చర్చి ప్రాంతం నుంచిపాత స్టేట్ బ్యాంకు వరకు రహదారి ఇరుకున ఉంది.ఇరువైపులా అడ్డగోలు వ్యాపారాలతో ట్రాఫిక్ సమస్య అడుగడుగునా తలెత్తుతోంది.

 సోమవారాలు,పండుగ రోజుల్లో రద్దీగా ఉంటుంది. పోలీసులు ట్రాఫిక్ చర్యల జోలికి అసలే వెళ్లడం లేదు. గడియార స్తంభం నుంచి చాబా ల వైపు వెళ్లే రాస్తా ఇరువైపులా ఆటోల నిలుపుదల, ద్విచక్ర వాహనాలు కార్లు ఎక్కడపడితే అక్కడ విరుద్ధంగా నిలుపుదల చేస్తే, వైయస్ విగ్రహం ముందు, పక్కన ఆటోలు సగం రోడ్డును దురాక్రమించుకొని పార్కింగ్ చేస్తారు. గుంతకల్లు వెళ్లే రాస్తా ఇరువైపులా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. పాత బస్టాండులో పూలు, పండ్ల వ్యాపారులతో ట్రాఫిక్ అష్టదిగ్బంధనంలో ఉంది.

 నానాటికి పెరుగుతున్న జనాభా, వాహన సంచారంతో ఉరవకొండలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది.

 రిక్రియేషన్ క్లబ్బు పక్కన మెకానిక్ రోడ్డుపై అడ్డగోలు, వాహన పార్కింగ్ అడ్డగోలు మెకానిక్ పనులతో, ట్రాఫిక్ ప్రమాదాలకు గురి కావాల్సిన వస్తోంది.

 పంచాయతీ పాలకవర్గం అధికారులు పోలీసులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...