అమెరికా:ఆఫ్ఘనిస్థాన్లోని కీలకమైన బగ్రాం ఎయిర్బేస్ను తిరిగి అప్పగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లేనిపక్షంలో “తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ తన **సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’**లో పేర్కొన్నారు, "బగ్రాం ఎయిర్బేస్ను అమెరికాకు నిర్మించిన వారికి ఆఫ్ఘనిస్థాన్ తిరిగి అప్పగించకపోతే, తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి." ఇప్పటికే ఈ స్థావరాన్ని తిరిగి పొందేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తాలిబన్ పాలనలోని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ సీనియర్ దౌత్యవేత్త జలాలీ శనివారం మీడియాకు వివరించగా, “తమ భూమిపై విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోము. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా మాత్రమే అమెరికాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగించాలి” అని వెల్లడించారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment