తవణంపల్లి:- తవణంపల్లి మండల కేంద్రంలో ద్రౌపతి ధర్మరాజుల ఆలయంలో 120వ మహాభారత మహోత్సవ ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి శెట్టి మాట్లాడుతూ 21 ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ నక్షత్రం యోగంతో కూడిన శుభ వృశ్చిక లగ్నమందు తవణంపల్లి కేంద్రంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత యజ్ఞం ధ్వజారోహణ జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి మాట్లాడుతూ 21వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మహాభారత హరికథ గాన కోకిల నాట్య మయూరి టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ హరికథ కాలక్షేపం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ సందర్భంగా ప్రతిరోజు 2 గంటల నుండి6 గంటల వరకు ఏ. శారద భాగవతలని గారిచే హరికథ కాలక్షేపం29 వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5. 30 గంటల వరకు మహాభారత హరికథ కాలక్షేపం జరుగుతుందని 29 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బక్కసుర బలి బండి అదే రోజు నుండి 12. 10. 20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 14 రోజులు ప్రతిరోజు రాత్రి వీధి నాటకంలో తమిళంలో అతి వైభవంగా జరుగును నాటక కళాధారులు ఓం శ్రీ వరసిద్ద వినాయక నాట మండలి వారిచే మేనేజర్స్ టీ.రంగన్ ,ఆనందం .ఏమని డి. అరవింద్ సాయి వినీత్ వీరిచే వీధి నాటకం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆలయ ధర్మకర్త గుడిసె మునస్వామి సదాశివ శెట్టి మోహన్ వేలు మాజీ ఆలయ ధర్మకర్త గణేష్ యువజన సంఘ సభ్యులు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలోపాల్గొన్నారు
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment