Skip to main content

ఆర్ డి టి సేవలకు బ్రేకులొద్దు.. ఫెరా పునరుద్ధరణే ముద్దు


 -అసెంబ్లీ లో ఎం ఎల్ ఏల్ లు:పరిటాల సునీత, బండారు శ్రావణి పునరుద్దరణ చర్చలు.

-జిల్లా వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసన జ్యాలలు

 -ట్రూ టైమ్స్ ఇండియా:

ప్రభుత్వ0 ఆర్ డి టి సేవలకు బ్రేకు లేయోద్దంటూ అలాగే ఫెరా చట్టాన్ని పునరుద్ధరించాలన్ని అభివృద్ధి కామకులు బిజెపి మాజీ తాలూకా యువ మోర్చా అధ్యక్షులు, జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు, ఆర్ డి టి మాజీ ప్రధానోపాధ్యాయులు మాలపాటి శ్రీనివాసులు, జై కిసాన్ ఫౌండర్ నాగమల్లి ఓబులేశు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 

 ఆర్ డి టి సేవా సంస్థప్రభుత్వ సేవలకు ధీటుగా సేవలందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మంచిని స్వాగతించాలన్నారు. అనంతపురం కరువు జిల్లాలో స్థాపించి జిల్లా ఆమూలాగ్రం ఎస్సీ,ఎస్టీ,బడుగు బలహీన వర్గాలకు విద్యా, వైద్య సేవలు అందించిన ఘనత ఆర్ డి టి కే దక్కుతుందన్నారు.

 

గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు నడుం బిగించిందన్నారు. విద్యా బోధనకు అవసరమైన పాఠశాలలో నిర్మించి, తద్వారా ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘన కీర్తి ఆర్డిటిదే అనివారు కొనియాడారు.

 వైద్యం కోసం ఆసుపత్రులు నిర్మించి తద్వారా పేదలకు రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోందని గుర్తు చేశారు. 

ప్రభుత్వం నిర్మించలేని ఎన్నో ఇళ్లను నిర్మించి నివాసాలు కల్పించారన్నారు.

 ఆర్డిటి స్కూల్స్ పాటు కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యాసకులకు కార్పొరేట్ చదువులకయ్య ఖర్చులు భరించింది ఎవరని అడిగితే ఆర్డిటిని అని టక్కువమని సమాధానం చెబుతారని గుర్తు చేశారు.

 రైతులు రైతు కూలీల అవసరాల కోసం భూసార పరిరక్షణ కుంటకట్టలు ఏర్పాటు, ఊట చెరువులు తవ్వించి తద్వారా అభివృద్ధి బాటలు వేసిన సంస్థ ఆర్డిటి.

 సేవే ధ్యేయంగా పనిచేసింది. నిరుద్యోగం తాండవిస్తున్న జిల్లాలో ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఎందరో యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచింది నిలుస్తోంది. జిల్లా ప్రజల గుండెల్లో శాశ్వతముద్ర వేసుకుంది. తన సేవా పరంపర ఇతర జిల్లాలకు సైతం విస్తరించింది. ఏ పార్టీకి వత్తాసుపలకకుండా రాజకీయాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న ఆర్ డి టి సంస్థకు కూటమి ప్రభుత్వం ముగుదాడు వేయ సంకల్పించుట సరైన చర్య కాదని ధ్వజ మెత్తారు. 


విన్సెంట్ ఫెర్రర్, ఆయన సతీమణి శ్రీమతి అన్ని ఫెర్రర్ దంపతులు అనంత ఆది దంపతులుగా అభివర్ణించారు.

 

విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగ పరిచిన దాఖలాలు మచ్చుకైనా లేవు:. మరి అలాంటి నిస్వార్థ సేవలు అందిస్తోంది. 

తల్లితండ్రుల బాటలోనే తనయుడు : తండ్రి ఆశయ సాధనలో తనయుడు మంచూ ఫెర్రర్ పయనిస్తున్నారు. క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. స్టేడియం లు నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినో నిర్వహించారు.

 ప్రతిసారి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం రెన్యువల్ చేసే సమయానికి ప్రభుత్వం చిక్కులు సృష్టిస్తోంది. ఎలాంటి అరామరికలు లేని సేవలందిస్తున్న ఆర్డిటికీ బ్రేకులు వేస్తే తద్వారా అనంత జిల్లా వాసులు నష్టపోతారు. తిరిగి నిరుద్యోగం తాండవిస్తోంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంధకారంలో వెళుతుంది.

 కూటమి ప్రభుత్వం పునరాలోచించి విదేశీ విరాళాల చట్టం లోబడి పని చేస్తున్న సంస్థ యొక్క సేవలు యధాతతంగా కొనసాగించడానికి పునరుద్ధరణ అనుమతులను తక్షణమే చేపట్టాలని, కూటమి ప్రభుత్వం ఆర్ డి టి సంస్థ పేదలకు చేసిన మంచిని గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బిజెపి మాజీ తాలూకా యువ మోర్చా అధ్యక్షులు, జిల్లా భారతీయ మద్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు, మాజీ ఆర్డిటి ప్రధానోపాధ్యాయులు మాలపాటి శ్రీనివాసులు, డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...