Skip to main content

అపరిశుభ్రతకు ఆనవాళ్లు పెన్నొబిలంలో కోనేర్లు.

 ప్రచారం ఉరవకొండ. శుభ్రం గోరంత.

- శ్రీ లక్ష్మీ నరసింహని సాక్షిగా అడుగడుగునా అపరిశుభత్ర




సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పెన్నోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దిగువన ఉన్న కోనేరులో చెత్త చెదారం అపరిశుభ్రత తాండవిస్తుంది దేవస్థానం దిగువన ఉన్న పుట్టుశిల ఉద్భవ లక్ష్మమ్మ కోనేరు నిండా చెత్త చెదారం పేరుకుపోయింది. దేవస్థానానికి వచ్చే భక్తులు కోనేరు నుంచి వెదజల్లే దుర్వాసన కంపు భరించలేక పోతున్నారు అమ్మ వారి శరణ నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనీసం శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆయన శుభ్రం చేయించాలన్న ఇంగితం అంటూ దేవస్థానం అధికారికి గాని సిబ్బందికి గాని ఇంగితం లేకపోయింది అధికారులు సిబ్బంది నెలకు వేలు జీతాలు దొబ్బేస్తున్నారు వచ్చామా? వెళ్ళామా? జీతం పొందామా? అనే ముచ్చటగా మూడు సూత్రాలను శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా అమలు పరుస్తున్నారు. పాల గోపురం దిగువున ఉరవకొండ కు చెందిన అన్న సత్రం పక్కన ఉన్న కోనేరు అపరశుభ్రతతో తాండవిస్తుంది ఇక ఉరవకొండ కు వెళ్లే మార్గంలో ఉన్న నాలుగు స్తంభాల కోనేరు జాడ కనిపించడం లేదు ప్రధాన కోనేరు అపరిశుభ్రతకు కేరాఫ్ గా నిలుస్తాయి. వీటిలోని అపరిశుభ్రత తొలగించక పోగా తాజాగా నూతన ఈవో తిరుమలరెడ్డి 'దెయ్యాలు వేదాలు వళ్ళించిన చందంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏక్ దిన్ ఏక్ గంట శ్రమదానికి కార్యక్రమం చేపట్టినట్లు ఉత్తుత్తి ప్రకటనలు గుప్పిచ్చి భక్తులను మాయలో, భ్రమలో పడేస్తున్నారు. దేవస్థాన సిబ్బంది పంపిన ఫోటోలను పరిశీలించినట్లయితే ఇంతకాలంగా కోనేటి కంపు ఎలా భరించారో అనేది స్పష్టం అవుతుంది. మరి ఎంత మేరకు ఏక్ దిన్ ఏక్ గంటలో శుభ్రం చేయించిన చిత్రాలు పెట్టకపోవడం విడ్డూరం. కేవలం ప్రచారం కొండంత ఉంది ఆచరణ గోరంత ఉంది. 

నాలుగు మాడవీధుల్లో చెత్తాచెదారం రోజువారీగా శుభ్రం చేసి కోనేరు కోనేరులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తే భక్తులు హర్షిస్తారు ఇబ్బడి, ముబ్బుడిగా ప్రచారం కోసం తహతహలాడే ఇలాంటి ప్రకటనలు మానుకోవాలి. పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి అయినా పట్టించుకోరు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి విరాళాల వెళ్ళు వెతుతున్నా రథ నిర్మాణానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. భక్తుల వసతి గృహాల్లో శుభ్రత కరువైంది శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం అన్నీ ఉన్నా భక్తుల నోట శని అందచందంగా మారింది. పరిశుభ్రత అభివృద్ధిపై అతి జరూరు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరసింహా! పని దొంగలను హుండీ దొంగల్లో మార్పు తెప్పించి దేవస్థాన అభివృద్ధి కోసం మేలుకో స్వామీ!

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...