శాసనసభ, మండలిలో ఏఐ ఆధారిత హాజరు నమోదు

0
శాసనసభ, శాసనమండలిలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు వారి సీట్లలో కూర్చున్న వెంటనే ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) సాంకేతికత ద్వారా ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. సభకు హాజరైన, హాజరుకాని సభ్యుల వివరాలు నేరుగా సీఎం డ్యాష్‌బోర్డుకు చేరనున్నాయి. ఈ వ్యవస్థ అమలు బాధ్యతను హైదరాబాదుకు చెందిన డ్యురాంక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్దిష్ట సమయానికి సభలో సభ్యుల వీడియో రికార్డింగ్ తీసుకుని, డేటాలో నిక్షిప్తం చేసిన ఫొటోలతో సరిపోల్చి జాబితాను సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత సభలో పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సభ్యుడి ముఖ లక్షణాలను డేటాలో 175 వెక్టార్ పాయింట్ల రూపంలో నమోదు చేస్తారు. కెమెరాలు 180 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతి గంటకు సభ్యుల ఫొటోలు సర్వర్‌కు పంపిస్తాయి. అక్కడి ప్రత్యేక సాఫ్ట్వేర్, ముందే నిక్షిప్తం చేసిన వెక్టార్ పాయింట్లతో పోల్చి హాజరైన, గైర్హాజరైన సభ్యుల జాబితాను రూపొందిస్తుంది. ఇప్పటివరకు సభ్యులు సభ వెలుపల ఉన్న రిజిస్టర్‌లో సంతకాలు చేసి హాజరు నమోదు చేసుకుంటున్నారు. కానీ కొత్త ఏఐ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి రాగానే సంతకాల విధానానికి ముగింపు పలికే అవకాశముంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!