మన ఆహారపు అలవాట్లలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో బొప్పాయి (Papaya) ఒక అద్భుతమైన సహజ ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేస్తుంది.
బొప్పాయిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరల్ జబ్బులు దూరం అవుతాయి.
మధుమేహ రోగులు కూడా భయపడకుండా ఈ పండును తినవచ్చు. దీనిలో సహజ చక్కెర తక్కువగా ఉండటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కలదు. మోకాళ్ల నొప్పులు, వయో సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
బొప్పాయి ప్రత్యేకంగా మహిళలకు ఉపయోగకరమని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. నెలసరి క్రమబద్ధంగా రావడంలో, పాలు పెరగడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ A, E, C, బీటా కెరోటిన్ అధికంగా ఉండటంతో చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
ఇటీవలి కాలంలో పెరుగుతున్న క్యాన్సర్, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడంలో కూడా బొప్పాయి పాత్ర విశేషమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెంగ్యూ రోగులకు బొప్పాయి ఆకుల రసం ఒక వరంగా పనిచేస్తుందని అనుభవాలు చెబుతున్నాయి.
100 గ్రాముల బొప్పాయిలోని ముఖ్య పోషకాలు:
శక్తి : 40 kcal
పీచు పదార్థాలు : 1.8 g
చక్కెరలు : 5.9 g
విటమిన్ సి : 61.8 mg (రోజువారీ అవసరానికి 103%)
విటమిన్ A, E, బి సమూహ విటమిన్లు సమృద్ధిగా లభ్యం
కాల్షియమ్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి.
మొత్తం గా, బొప్పాయి కేవలం పండు మాత్రమే కాదు – ప్రతి ఇంటి వైద్యశాలలో తప్పనిసరిగా ఉండాల్సిన సహజ ఔషధం.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment