470
ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
ట్రూ టైమ్స్ ఇండియా
పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి, తిరుపతి నుంచి జల్నాకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. చెన్నై - షాలిమార్, కన్యాకుమారి- హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. పండగ రద్దీని నియంత్రించేందుకు మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
