నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ మానవతా మనసును చాటుకున్నారు. "మాట ఇస్తే తప్పకుండా అండగా నిలుస్తాం" అని చెప్పినట్టుగానే, ఉత్తమ ప్రతిభ చూపిన దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయాణానికి ఆర్థిక సహాయం అందించారు.
గురువారం విపిఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యా స్వరూపిణికి రూ.1.30 లక్షలు, సిరివల్లికి రూ.1.25 లక్షలు, భవాని పూజితకు రూ.30 వేల రూపాయలు ఫీజుల నిమిత్తం అందజేశారు. ఈ మొత్తాలను విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా అందజేసి, విద్యార్థులను ఆశీర్వదించారు.
గత జూన్ 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్” కార్యక్రమంలో నెల్లూరు, పొదలకూరు భవిత కేంద్రాల్లో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఈ ముగ్గురు విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. ఆ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఈ విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు ఇప్పుడు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. దంపతులు చిన్నారులను ఆశీర్వదిస్తూ, "మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మా సహాయం కొనసాగుతుంది" అని హామీ ఇచ్చారు.
విపిఆర్ దంపతుల చేయూతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. “అడగకుండానే అండగా నిలిచిన విపిఆర్ దంపతులకు మనఃపూర్వక కృతజ్ఞతలు” అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీ వెంకట సుబ్బయ్య, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ప్రసాద్రావు, ఎంఈవో మురళి, ఐఈఆర్టీలు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment