Skip to main content

ఆర్డీటీ సేవలకు సుగమనం: ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌కు కేంద్రం అంగీకారం

 

ఉరవకొండ,ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 09: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ఆర్డీటీ పునరుద్ధరణ (రెన్యువల్) కోసం కేంద్రం అంగీకారం తెలపడంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది పేద లబ్ధిదారులు, బడుగు బలహీన వర్గాలలో ఉత్సాహం వెల్లివిరిసింది.

అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, దివ్యాంగుల సేవలు వంటి ఏ టు జెడ్ సేవలను అందిస్తూ ఆర్డీటీ సంస్థ మంచి ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ చర్యలను నిలిపివేయడంతో సేవలకు కొంతకాలం బ్రేక్ పడింది.

'మన జన ప్రగతి' పోరాటం కీలకం

ఆర్డీటీ సేవలకు ఎదురైన ఈ ఆటంకాన్ని 'మన జన ప్రగతి' దినపత్రిక ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. "ఆర్డీటీ సేవలకు బ్రేకులొద్దు.. ఎఫ్‌సీఆర్‌ఏ ముద్దు" మరియు "పేద బడుగు బలహీన వర్గాల సేవలో తరిస్తున్న ఆర్డీటీ సంస్థ సేవలకు కళ్లెం వేయవద్దు" అనే శీర్షికన కథనాలను ప్రచురించింది. పేద లబ్ధిదారులను మేలుకొలిపే ప్రయత్నంలో పత్రిక కీలక భూమిక పోషించింది.



ముఖ్యమంత్రులు, మంత్రుల జోక్యం

ఈ సమస్యను రాష్ట్ర అసెంబ్లీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో పాటు పలువురు తెదేపా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ స్పందించారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ సైతం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవడంలో కీలక పాత్ర పోషించారు.

అంతిమంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీటీకి తక్షణమే ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించాలని పేద ప్రజల నుంచి వచ్చిన ప్రభంజనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

దీంతో ఆర్డీటీ సేవా మార్గాలు తెరుచుకున్నాయి, లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నిర్ణయం పట్ల కృషి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 'మన జన ప్రగతి' దినపత్రిక హ్యాట్సాఫ్ తెలిపింది.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...