Skip to main content

బాబోయ్.. వాట్సాప్ కొత్త రూల్ అంట.. ఇకపై మెసేజ్‌లు అదేపనిగా పంపితే అంతే.. లిమిట్ దాటితే బ్లాక్ చేస్తుంది..!




వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో స్పామ్ మెసేజ్ తీవ్రత పెరుగుతోంది. ఈ స్పామ్ కంటెంట్ కు చెక్ పెట్టేందుకు మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువస్తోంది. వాట్సాప్ యూజర్లు, బిజినెస్ అకౌంట్లకు తెలియని నంబర్‌లకు పంపగల మెసేజ్ సంఖ్యను పరిమితం చేసే కొత్త రూల్ త్వరలో అమల్లోకి రానుంది.


మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు తెలియని వ్యక్తులకు పదే పదే మెసేజ్ పంపే యూజర్లు, బిజినెస్ అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్పామ్‌ను తగ్గించడానికి త్వరలో మెసేజ్ లిమిట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందుకోసం మెసేజ్ లిమిట్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. అనంతరం వాట్సాప్ యూజర్ల అందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.


*కొత్త నిబంధనలివే :*

ఇప్పుడు, ఒక వాట్సాప్ యూజర్ లేదా మర్చంట్ అకౌంట్ పంపిన ప్రతి మెసేజ్ సమాధానం వచ్చిందా లేదా అనేది లెక్కిస్తుంది. తెలియని వ్యక్తికి సందేశం పంపితే వారు ఆన్సర్ ఇవ్వకపోతే ఆ మెసేజ్ నెలవారీ పరిమితిలో లెక్కిస్తుంది. ఆ తర్వాత లిమిట్ విధిస్తుంది.


*లిమిట్ దాటితే అలర్ట్ :*

వాట్సాప్ మెసేజ్ లిమిట్ దగ్గరపడే కొద్ది యాప్ పాప్-అప్ అలర్ట్ డిస్‌ప్లే చేస్తుంది. వినియోగదారులకు ముందుగానే అలర్ట్ ద్వారా తెలియజేస్తుంది. తద్వారా యూజర్లు తమ అకౌంట్ బ్లాక్ అయిందని గమనించాలని మెసేజింగ్ దిగ్గజం తెలిపింది. వినియోగదారులు లిమిట్ దాటితే వారికి తెలియని వ్యక్తులకు మరిన్ని మెసేజ్‌లను పంపకుండా టెంపపరీగా బ్లాక్ చేస్తుంది.


*అనేక దేశాలలో ఫీచర్ టెస్టింగ్ :*

రాబోయే వారాల్లో కంపెనీ ఈ ఫీచర్‌ను అనేక దేశాలలో టెస్టింగ్ చేయనుంది. భారత్ సహా కొన్ని ప్రధాన మార్కెట్లలో త్వరలో టెస్ట్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ సిస్టమ్ ప్రధానంగా స్పామ్‌ను నిరోధించేందుకు రూపొందించింది. సాధారణ యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని వాట్సాప్ చెబుతోంది.


*మెసేజ్ లిమిట్ ఎందుకంటే? :*

వాట్సాప్ ఇకపై కేవలం చాట్ యాప్ కాదు. వ్యాపారం, కమ్యూనికేషన్ కోసం అద్భుతమైన టూల్. ప్రతిరోజూ డజన్ల కొద్దీ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇందులో చాలా వరకు ప్రమోషనల్ లేదా స్పామ్ ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులు అనవసరమైన మెసేజ్‌లను నివారించేందుకు 2024లో వాట్సాప్ మార్కెటింగ్ మెసేజ్ లిమిట్స్, అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది.


అదనంగా, ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ మెసేజ్ లిమిట్స్ అమల్లోకి తెచ్చింది. ఈ ప్రయోగాన్ని ఇప్పుడు 500 మిలియన్లకు పైగా యూజర్లు కలిగిన భారత్ సహా 12కి పైగా దేశాలకు విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది....

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...