Skip to main content

నేనున్నాను... మంత్రి సత్య కుమార్ యాదవ్



తాడిమర్రి, అక్టోబర్ 21 :– ధర్మవరం ప్రజలు తనను ఎంతో నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారని, వారికి ఏ ఆపదొచ్చినా తాను అండగా ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా కల్పించారు. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన సాకే విగ్నేష్ ను మంత్రి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు పరామర్శించారు. సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పిన్నదరి గ్రామానికి చెందిన సాకే విగ్నేష్ (3 సంవత్సరాలు) అనే బాలుడికి గుండె సంబంధిత అత్యవసర చికిత్స అవసరం ఉండటంతో, మంత్రి చొరవతో తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బాలుడు విజయవంతంగా శస్త్రచికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు, మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం పిన్నదరి గ్రామానికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాబు ఆరోగ్యం క్షేమంగా ఉందని మంత్రి కి నివేదించారు. అనంతరం మంత్రి వెంటనే ఫోన్ కాల్ ద్వారా బాలుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా వారికి ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా హరీష్ బాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించారు . లేఖలో మంత్రి ఇలా పేర్కొన్నారు... మీ బాబు సాకే విగ్నేష్ తిరుపతి లోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో గుండె శాస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ చేయబడి మీ ఇంటికి చేరుకున్నారని శుభవార్త తెలుసుకొని నేను ఎంతో ఆనందించాను. 

నామీద నమ్మకంతో ధర్మవరం శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన మీకు ఎంత సేవ చేసినా అది ఉడతా భక్తి సాయమే మీ బాబు పరిపూర్ణ ఆరోగ్యంతో పది కాలాలపాటు సంతోషంగా ఉండాలని నా ఆకాంక్ష.

మా సంస్కృతి సేవా సమితి మరియు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం మీకు ఎల్ల వేళలా వెన్నుదునుగా నిలుస్తాయి. మున్ముందు మీ కుటుంబం సంపూర్ణమైన ఆరోగ్యం ఆనందకర జీవితం గడపాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రామ్మోహన్, ధర్మవరం రూరల్ మండల అధ్యక్షులు చంద్ర, కూటమి నాయకులు విశ్వనాధ్, కేశవ నారాయణ, కిరణ్ కుమార్, సదా శివ, రమణ, రాజు, శ్రీనివాసులు, ఆకులేటి వీరనారప్ప, పోతుకుంట రాజు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...