ఉరవకొండ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ నేడు ఉరవకొండలో అందుబాటులో ఉండనున్నారు.
మంగళవారం (07-10-2025) ఉదయం 11 గంటలకు, మంత్రి కేశవ్ గారు ఉరవకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలను కలవనున్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయకులు తమ సమస్యలను లేదా వినతులను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ వర్గాలు తెలిపాయి.
