Skip to main content

ట్రంప్‌ సుంకాలపై సిపిఐ(ఎం) నిరంతర పోరాటం


 

- సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు


భారతదేశాన్ని బెదిరించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన సుంకాలపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తుందని సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 5,6 తేదీల్లో విజయవాడలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ”భారతపై ట్రంప్‌ సుంకాల యుద్ధం” అనే పుస్తకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కె.లోకనాధంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. 

బి.వి.రాఘవులు మాట్లాడుతూ.. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా 50శాతం పన్ను విధిస్తూ ఏకపక్షంగా ప్రకటించడం దారుణమని, రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నామని అదనంగా మరో 25శాతం పన్ను విధించడం మన సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు.

 ప్రజలకు అవసరమైన వాటిని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలో ఆ దేశం నిర్ణయించుకునే హక్కుందని, కానీ దీనికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశం ఎక్కడ, ఏం కొనాలో బెదిరించి, లొంగదీసుకునే స్ధితికి చేరుకోవడం గర్హనీయమన్నారు. దానికి ధీటుగా జవాబివ్వడంలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. 

అనేక చిన్న చిన్న దేశాలు చూపిన ధైర్యాన్ని, మన కేంద్ర ప్రభుత్వం చూపలేకపోవడం, అమెరికాకు అణిగిమణిగి ఉండేలా అవమానకరంగా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, అమెరికా సుంకాలను ప్రతిఘటించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి హితవు పలికారు.

 ఈ సుంకాల పెంపు వలన రాష్ట్రంలో ఆక్వా, ఆభరణాలు, ఆటోమొబ్కెల్స్‌ తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. లక్షలమంది ఉపాధి కోల్పోతున్న దుస్థితి నెలకొందన్నారు. హెచ్‌1బి వీసాలపై విధించిన ఆంక్షలు సైతం మరింత భయపెట్టేలా ఉన్నాయని, ఉన్నత చదువుల అనంతరం ఉపాధి కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇవి తీవ్ర ఆటంకంగా మారాయన్నారు. 

 మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో అంతా తెలుగువారే ఉన్నారని చెప్తుంటారని, కానీ హెచ్‌1బి వీసాలపై విధించిన ఆంక్షలపై మాత్రం నోరుమెదపడంలేదన్నారు. భారతీయ సినీ రంగంపై కూడా అమెరికా 100 శాతం పన్ను విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దానిపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడే స్థితిలో లేవన్నారు. అమెరికా ఎగుమతి చేస్తున్న వాటిపై మన దేశం పన్ను ఎత్తివేయాలని ఒత్తిడి తేవడం ఇంకా ప్రమాదకరమన్నారు. ఇదే కనుక జరిగితే రాష్ట్రంలో మొక్కజొన్న, పాడి, వ్యవసాయ ఉత్పత్తులు చేసే రైతులందరికీ తీవ్రమైన నష్టం కలుగుతుందని, దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి దీనిపై కనీసం ఉలుకుపలుకూ లేకుండా ఉండడం సరికాదన్నారు. బిజెపికి అడగకుండానే మద్దతిచ్చే జగన్‌ ఈ విషయంలోనైనా స్పందించాలన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...