Skip to main content

స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం





స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం

అభివృద్ధి అనేది హామీ కాదు – ఆచరణలో చేసి చూపిస్తున్నాం – మంత్రి సత్యకుమార్

బత్తలపల్లి, అక్టోబర్ 25:– ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలంలోని డి. చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు నిర్మించిన కొత్త బిటి రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,.... స్వతంత్రం వచ్చినప్పటినుండి రహదారి లేక ఇబ్బందులు పడుతున్న పత్యాపురం గ్రామం మరియు పత్యాపురం తండా ప్రజల అవసరాల నిమిత్తం ఈ బిటి రహదారి నిర్మించి, ప్రజల వినియోగానికి అందించడం నాకు ఆనందంగా ఉంది. ఈ రహదారి మొత్తం పొడవు 1060 మీటర్లు ఉండగా, ₹85.00 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేయబడింది. పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు ఈ బిటి రహదారి చాలా కాలంగా గ్రామ ప్రజల ఆకాంక్షగా ఉండేది. ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తికావడంతో తండా ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికీ నాణ్యమైన మౌలిక వసతులు అందించేందుకు కట్టుబడి ఉంది, అని మంత్రి తెలిపారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అనేది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు పంచాయతీరాజ్ శాఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు అందించడం మా ప్రధాన ధ్యేయం, అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, సర్పంచు రమాదేవి, బిజెపి బత్తలపల్లి మండల అధ్యక్షులు భాస్కర్, టిడిపి బత్తలపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, ఉప సర్పంచ్ సత్యం, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మేడ సారి అశోక్, కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...