Skip to main content

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్: పేదలకు వైద్యం అందని ద్రాక్షేనా? - కేశవ నాయక్

 ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:

అమరావతి/హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు, ప్రొఫెసర్లు లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూనే, ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రులు నిర్వహించడంపై గిరిజన ఐక్య సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల సంపాదన ధ్యేయంగా మారి, విలాసవంతమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ప్రైవేట్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పేద, బలహీన వర్గాలకు అన్యాయం

కేశవ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, కేవలం అధిక డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేయడం వల్ల పేదలు, నిరుపేదలు, బడుగులు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం లక్షలాది రూపాయల జీతం ఇస్తున్నప్పటికీ, ఆ జీతంతో సంతృప్తి చెందకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తూ, సంపాదనే ద్వేయంగా పనిచేస్తున్నారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం నాణ్యత తగ్గి, పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది" అని ఆయన విమర్శించారు.

ప్రైవేట్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులను నడుపుతున్నా, వారికి ప్రభుత్వం ప్రమోషన్లు ఇస్తూ, సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుతోందని నాయక్ అన్నారు. ఇది పరోక్షంగా ప్రైవేటు హాస్పిటళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రజలు భావించడానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.


కేశవ నాయక్ విజ్ఞప్తి

ప్రభుత్వ వైద్యులు, ప్రొఫెసర్లు తమ వైఖరిని మార్చుకోవాలని కేశవ నాయక్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వైద్యులకు విజ్ఞప్తి చేశారు.

ముఖ్య డిమాండ్లు:

 * ప్రభుత్వ వైద్యులు, ప్రొఫెసర్లు ప్రభుత్వం ఇస్తున్న జీతాలతోనే సరిపెట్టుకోవాలి.

 * సేవాభావంతో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ వైద్యశాలల్లోనే నాణ్యమైన వైద్యం అందించాలి.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి సారించి, ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...