Skip to main content

అపురూపం.. పర్వతేశ్వర ఆలయం.

 

- గోపురాలపై ఇతిహాసాల చిత్రాలు.

- ఉరవకొండ అక్టోబర్ 27




: మండల పరిధిలోని రాయంపల్లి లో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన పర్వతేశ్వర ఆలయం శిల్పకళలకు కాణాచి గా పేరొందింది. వీటిని తిలకించడానికి భక్తులు ఇటీవల బాగా వస్తున్నారు. కర్ణాటక నుంచి ఇక్కడకు వలస వచ్చిన సిద్దేశ్వర అవధూత ఈ క్షేత్రంలో ఆకలి డప్పులతో అలమటిస్తున్న ప్రజలను చూసి మనసు చలించడంతో తనువు చాలించారు. 

- ఈ క్షేత్రంలో ప్రజలు పాడిపంటలకు కొదవ రాకూడదని కోరుతూ జీవ సమాధి పొందారనేది నానుడి. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా మార్చి మాసంలో ఆయన సమాధికి పూజలు చేసి రథోత్సవం చేసుకోవటం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ.

- కనిపించని కరవు జాడ: ఆయన సమాధికి పూజలు ఆరంభించిన నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో కరువు జాడే లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలానుగుణంగా ఇక్కడ ఆలయం రూపు దిద్దుకుంది. శిల్పకళలకు ముఖద్వార, గర్బాలయా గోపురాల శిల్ప కళా నైపుణ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా సజీవ సాక్షిగా ఉండటం గమనార్హం. గోపురం అందాలు భక్తులను బాగా ఆకర్షిస్తున్నాయి. అప్పట్లో వీటిని సున్నం, గారా, మిశ్రమం చేసి గుండు రాతి కింద వేసి రుబ్బి నిర్మించారు. రెండు గోపురాలపై అద్భుత శిల్పాలు రామాయణ, భాగవతం చాటి చెప్పే చిత్రాలను ముఖద్వార గర్భాలయ గోపురాలపై శిల్పులు చెక్కారు

- గోపురాలపై శిల్పాచార్యులు చూపిన ప్రతిభా, పాటవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి స్వామివారి దర్శనం అనంతరం గోపురాలను తిలకించి భక్తులు తన్వయత్వం చెందుతారు. గోపురాలపై సప్తవర్ణాలు వినియోగించారు. ఎండకు ఎండీ వానకు తడుస్తున్నా 

 ఆలయ రంగులు మాత్రం చెక్కుచెదరటం లేదు. పైగా సూర్య కిరణాలు గోపురాలపై పడితే రంగులు తల తల మెరుస్తున్నాయి. రాయంపల్లి నారమెట్ల వ్యాసాపురం నింబగళ్ళు తదితర గ్రామాల భక్తులు ఆలయాన్ని నవీకరించారు. చుట్టూ బండ పరుపులు వేయించారు అంతర్భాగంలో నాపరాళ్ళు వేశారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు నిర్మించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు స్వామిగా పర్వతేశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నారు..

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...