Skip to main content

2వ డివిజన్ ప్రజా సమస్యలు పరిష్కరించుటలో మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని వీడాలి

 


 

-సీజనల్ వ్యాధుల దృష్ట్యా పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ చేపట్టండి

అనంతపురం అక్టోబర్ 27:

అనంతపురం నగరపాలక సంస్థ నందు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ కమీషనర్ డాక్టర్ పావని ను ప్రభుత్వ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.యం.డి.ఇమామ్ కలిసి 2వ డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 2వ డివిజన్ పరిధిలో ఉన్న స్థానిక యన్.టి.ఆర్ మార్గ్ లో ప్రతి రోజు పొట్ట కూటికోసం పనుల చేసు కుంటూ ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇలాంటి రోడ్డుకు ప్రక్కన స్కూల్స్, హాస్టల్, ప్రార్థన మందిరాల కు దగ్గర్లో రోడ్డు పై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, పెద్ద పెద్ద వాహనాలను ఎప్పుడూ నిలిపి ఉండటం, ఆవులు, కుక్కలు గుంపులుగా రోడ్డు పై అడ్డంగా కూర్చోవడం, రోడ్లపై చెత్త చెదారం పడి వుండటం వలన భాగ్యనగర్, అరవేటి నగర్, బిందెల కాలనీ, వినాయక నగర్ వీధుల నుండి వచ్చే ద్విచక్ర వాహన దారులకు, పాదాచారులకు నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య పనులు, కాలువలను శుభ్రపరచడం చెత్త, చెదారాన్ని తొలగించడం, దోమల బెడదతో నిత్యం విష జ్వరాలతో అనారోగ్యాలకు గురి అవుతున్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాగింగ్, బ్లీచింగ్ చేయాలని తెలిపారు.  

ఈ విషయం పై నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాలస్వామి కు గత 6 నెలలుగా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పొంతన లేని మాటలతో సచివాలయ కార్యదర్శి తో సహా కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యలను పరిష్కార మార్గం చూపే దశలో ప్రత్యేక చొరవ చూపాలని డిప్యూటి కమీషనర్ డాక్టర్ పావని ను ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అబ్దుల్, మహేష్, భాష తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...