రేణిగుంట, తిరుపతి జిల్లా:
రేణిగుంట మండలం గాజులమడ్యం పోలీస్స్టేషన్ పరిధిలోని గువ్వల కాలనీలో మైనర్ బాలుడిని కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.
మృతుడు శ్రీహరి (14) గా పోలీసులు గుర్తించారు. స్థానిక టిఫిన్ దుకాణం వద్ద జరిగిన ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
పోలీసుల సమాచారం ప్రకారం, మేస్త్రిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉండగా శ్రీహరి తన వైపు చూసి నవ్వాడని కోపంతో ఆ బాలుడిపై దాడి చేశాడు. కోపావేశంతో మెడ, గుండెపై కత్తితో పొడిచి శ్రీహరిని రక్తమోడేలా చేశాడు.
స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మరణించాడు.
సూచన అందుకున్న గాజులమడ్యం పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి గిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment