Skip to main content

విడపనకల్ రెవెన్యూ ఇంద్రజాలం: అంధుడికి అందని సమాచారం!

 




విడపనకల్ (అక్టోబర్ 28):

విడపనకల్ మండలంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన అంధుడైన కురువ ఎర్రిస్వామికి భూ సమాచారం విషయంలో అధికారులు చుక్కలు చూపించారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలకు, పొంతన లేని సమాధానాలిచ్చి దరఖాస్తుదారుడిని గందరగోళానికి గురిచేశారు.

 మ్యుటేషన్ గందరగోళం

భూమి మ్యుటేషన్ సందర్భంగా 'గొలుసు ఆధారిత పత్రాలు' (Chain Documents) ప్రామాణికంగా తీసుకుంటారా? కేవలం రిజిస్ట్రేషన్ దస్తావేజులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా? ఏ చట్టం ఏం చెబుతోంది? అని ఎర్రిస్వామి ప్రశ్నించారు.

 * దీనికి విడపనకల్ తాసిల్దార్ బదులిస్తూ, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా మ్యుటేషన్ చేస్తామని తెలిపారు.

 * అయితే, గొలుసు పత్రాలు పరిశీలించకుండా మ్యుటేషన్ చేస్తే, ఆస్తి చరిత్ర, అమ్మకాలు-కొనుగోలు వివరాలు ఎలా తెలుస్తాయని ఎర్రిస్వామి అనుమానం వ్యక్తం చేశారు.

 మరణ ధ్రువీకరణ పత్రాలతో మ్యుటేషన్!

ఇదిలా ఉండగా, కొట్టాలపల్లికి చెందిన చంద్రబాబు తండ్రి నారాయణస్వామి అమ్మమ్మ మృతి చెందారు. కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే, అడ్డగోలుగా, అక్రమంగా మ్యుటేషన్ చేశారని వార్త కథనం పేర్కొంది. ఈ మ్యుటేషన్ కోసం ఆస్తి తాలూకు గొలుసు పత్రాలు సమర్పించకుండానే ప్రక్రియ పూర్తి చేయడం రెవెన్యూ మాయగా అంధుడైన ఎర్రిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

 తప్పుడు స్కెచ్, లేని పత్రాలు

సబ్ డివిజన్‌కు సంబంధించిన వివరాలు అడగగా, ధృవీకరించిన పత్రాలు సమర్పించకుండా, సర్వే నంబర్‌కు సంబంధించిన తప్పుడు స్కెచ్‌ను ఇచ్చి అంధుడిని తప్పుదోవ పట్టించారు.

  సబ్ డివిజన్‌కు సంబంధించిన పత్రాలు, భూ కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు రెవెన్యూ కార్యాలయంలో లేవంటూ అధికారులు చేతులెత్తేశారు.

  "అడిగిన సమాచారం ఒకటైతే, అందించిన సమాచారం మరొకటి" అని, పొంతనలేని తికమక సమాచారంతో దరఖాస్తుదారుడు బుర్ర గోక్కున్నాడు.

 లోపించిన జవాబుదారీతనం

రెవెన్యూ అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పూర్తిగా లోపించిందని స్పష్టమవుతోంది. "ఇవ్వాళ, మొన్నటి సమాచారం ఇచ్చి" అంధుడైన బాధిత దరఖాస్తుదారుడిని ఇబ్బందుల పాలు చేయడం వెనుక "రెవెన్యూ మాయాజాలం, ఇంద్రజాలం" ప్రదర్శించడమేనని ఎర్రిస్వామి ఆరోపించారు.

లోపభూయిష్టమైన సమాచారం సమర్పించడం వెనుక బాధ్యులతో కుమ్మక్కైనట్లు వారిచ్చిన సమాధానాల ద్వారా స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. సబ్ డివిజన్, కొనుగోలు రికార్డులు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని తేల్చకుండా ఒంటెత్తు పోకడలతో సమాధానాలివ్వడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎర్రిస్వామి డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...