బొమ్మనహల్ మండల కేంద్రానికి వెళ్లే రహదారిలో ప్రమాద ఘంటికలు - ఆర్&బీ రోడ్డు గుంతలతో ప్రయాణికులకు ఇక్కట్లు
బొమ్మనహల్, అక్టోబర్ 24
బొమ్మనహల్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన ఆర్.అండ్.బి. (భవనాలు, రహదారులు) రోడ్డు ప్రమాదకరంగా మారింది. దర్గాహొన్నూరు, గోవిందవాడ, దేవగిరి, బండూరు, కల్లుదేవనహల్లి, తారకపురం వంటి పలు గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఈ రహదారిపై ప్రయాణించాల్సి ఉంటుంది.
అయితే, రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం వల్ల వాహనదారుల ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది వాహనాలు ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తుండగా, గుంతల కారణంగా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
తరచూ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో, సంబంధిత ఆర్.అండ్.బి. అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్రంగా కోరుతున్నారు.


Comments
Post a Comment