ఆంధ్రప్రదేశ్ : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతోన్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు.
ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై సమీక్షించారు.
తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Comments
Post a Comment