Skip to main content

ప్రేమించాడు..వంచించాడు.

 


 - విడపనకల్ వజ్రకరూర్ కూడేరు మండలాలకు విలేకర్లు ఏరి?

- అన్నా వదినలు, పిల్లలపై దాడి ఘటన పై చర్యలేవి?

- వార్తలు రాసిన విలేకరులపై బెదిరింపా?

 ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా

పచ్చ పత్రికలో పనిచేస్తున్న ఉరవకొండ ఓ విలేఖరి ఒకరిని ప్రేమించి వంచించిన ఘరానా మోసగాడు. విద్యార్థి మృతికి అతను ప్రధాన కారకుడు.కొన్ని రోజులకు క్రితం రాయం పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ప్రేమించాడు. మరో వివాహిత మహిళలతో అక్రమ సంబంధం ఏర్పచుచేసుకొని అమ్మాయిని మోసగించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ససేమిరా అనటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారు. విలేకరి మీద దాడికి పాల్పటం కూడదని భావించిన ఆ కుటుంబీకులు క్షమా బిక్ష పెట్టారు. 

కుక్క తోక వంకర అన్న చందంగా : కుక్క తోక వంకర అన్న చందంగా తిరిగి అదే బుద్ధి అవలంబించారు. ఉరవకొండ వనరుల కేంద్రంలో పనిచేస్తున్న ఓ వివాహిత మహిళపై కన్నేశారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదని, బూటకపు వార్తలు రాసి బ్లాక్ మైలింగ్ కు పాల్పడ్డారు. బాధితురాలు భర్తకు ఫిర్యాదు చేయడంతోఆ విలేకరికి గట్టిగా బుద్ధి చెప్పారు. లేనిపక్షంలో దేహశుద్ధి చేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితురాలు సామాజిక వర్గానికి చెందిన ఓ విలేకరి సాయంతో మధ్యవర్తిత్వం చేశారు. సత్ప్రవర్తనతో నడుచుకుంటామని ప్రాధేయపడ్డారు. 

ఇది ఇలా ఉండగా ఓ ఉపాధ్యాయుని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 సంస్థ దృష్టికి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే : పనిచేసే సంస్థ దృష్టికి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే విచారణ బాధ్యత స్టాఫ్ రిపోర్టర్ కు అప్పగిస్తారు. సదరు విలేఖరి స్టాఫ్ రిపోర్టర్ కు మంచి దోస్తానా ఉంది. ఒకే కంచం ఒకే మంచం వారిద్దరిది. గతంలో ఉరవకొండ విలేఖరి పర్యవేక్షణలో స్టాఫ్ రిపోర్టర్ శిక్షణ పొందారు. అందుకే ఫిర్యాదులన్నీ స్టాఫ్ రిపోర్టర్ తూచ్ మనిపిస్తున్నారు.

 ఇద్దరూ ఇద్దరే: మీది తెనాలే, మాది తెనాలే. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఫిర్యాదులన్నీ బుట్ట దాఖలు అవుతున్నట్లు ఆరోపణలు సర్వత్రావెల్లువెత్తుతున్నాయి.

 విలేఖరివి ఒంటె పోకడలు : తన మాటే వేదం తాను రాసిందే నిజమని మనస్తత్వం ఆయనది. విలేఖరివి వింత పోకడలు. తాను రాసిందే నిజమైన వార్త అనే నైజం. అనవసరమైన వార్తలు రాశావంటూ కొద్ది రోజుల క్రితం ట్రాన్స్ జెండర్స్ దాడి చేశారు. తమ గురించి ఎందుకు రాశావని విలేఖరిని వారు నిలదీశారు. దీంతో బెదిరిస్తున్నారంటూ ట్రాన్స్ జెండర్స్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ట్రాన్స్ జెండర్స్ కలిసి మా మీద వ్యతిరేక వార్తలు రాసేదే కాక మా పైనే ఫిర్యాదు చేస్తావా అంటూ పోలీస్ స్టేషన్లోనే రౌండ్ అప్ చేశారు. ఎస్ఐ సీఐ ఎదుటే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు మిన్న కుండిపోయారు.

 విలేఖరులను నిలవరించరు : ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు, విడపనకల్లు కూడేరు మండలాలకు ఇప్పటిదాకా విలేకరులు లేకపోవడం కొసమెరుపు. తన మాట వినని వ్యక్తులపై లేనిపోని అభియోగాలు మోపుతూ స్టాఫ్ రిపోర్టర్ దృష్టికి తీసుకెళ్లి 

వూస్టింగ్ చేయిస్తున్నారు. పెద్ద పత్రిక అత్యధిక ప్రజాదరణ పొందిన పత్రికలో పనిచేయటానికి మూడు మండలాల్లో ఒక్కరు లేరా రారా అనేది సంస్థ యాజమాన్యం సింహావలోకనం చేసుకోవాలి.

 అవినీతి అక్రమాలు, బ్లాక్మెయిలింగ్, దుర్మార్గమైన దాడి, ఆత్మహత్య కారకుడైన విలేకరిపై సంస్థ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులచే సమగ్ర విచారణ జరిపించాలని పాఠకులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...