పంచాయతీ కార్యదర్శి, సీఐ అవినీతిపై మంత్రి పయ్యావులకు ఫిర్యాదు.

Malapati
0

ఉరవకొండ:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి,గౌస్ సీఐ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు గురువారం టిడిపి కార్యకర్త, ఎమ్మార్పీఎస్ నేత, జిల్లా సమాచార హక్కు చట్టం కార్యదర్శి మీనుగ మధుబాబు మంత్రికి విన్నవించారు.

పట్టణంలో గురువారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలు వీధుల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ క్రమంలో మధుబాబు మంత్రిని కలిసి స్వయంగా గోడు వినిపించారు. గ్రామ కార్యదర్శి గౌస్, సీఐ మహానంది వైసీపీ పార్టీకి వీర విధేయులన్నారు. ఆ పార్టీ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టిడిపి కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధుబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామ కార్యదర్శి అక్రమ, అడ్డగోలు భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు.

 ఒక కార్యకర్తగా తమ గెలుపుకు కృషి చేశామని తెలిపారు. మంత్రి పదవి పయ్యావుల కేశవకుమంత్రి పదవి వరించాలని ఆర్థిక లేక రెవెన్యూ శాఖ పదవి కేటాయించాలని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చామన్నారు.

 అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదన్నారు. ఈ ఇరువురు అధికారులు ప్రతిపక్ష పార్టీకి కొమ్ము కాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

 పట్టణంలో దొంగతనాలు జూదాలు పెట్రేగిపోతున్నాయని వాటిని నియంత్రించడంలో సిఐ విఫలమయ్యారన్నారు అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని సుపరిపాలన అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి మధుబాబు కోరారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!