![]() |
| ఉరవకొండ రూరల్లో రచ్చబండ ద్వారా సంతకాల సేకరణ; గ్రామ కమిటీల నియామకం |
ఉరవకొండ :మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) చేపట్టిన 'ప్రజా ఉద్యమం - కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం ఉరవకొండ రూరల్ మండలంలో ఉధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు.
నాయకుల ఆదేశాలు, కమిటీల ఏర్పాటు
పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. విశ్వేశ్వర్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వై. ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో రాకెట్ల గ్రామం, మోపిడి గ్రామాలలో వైఎస్సార్సీపీ గ్రామ ముఖ్య కమిటీలు మరియు అనుబంధ కమిటీలను నియమించడం జరిగింది. రైతు, మహిళ, యువత, విద్యార్థి, ఎస్సీ, బీసీ, సోషల్ మీడియా విభాగాలకు చెందిన కమిటీలను ఏర్పాటు చేశారు.
కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపి వీరన్న పాల్గొన్నారు. అబ్జర్వర్లు డి. సురేష్, గంగాధర, అశోక్, ఓబన్న, ఏసీ ఎర్రిస్వామి, ఎర్రిస్వామి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాకెట్ల గ్రామానికి సంబంధించి కొత్తగా ఎన్నికైన ముఖ్య కమిటీ అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షుల వివరాలు:గ్రామ కమిటీ అధ్యక్షుడు కె. రాజు బోయ ,రైతు విభాగం అధ్యక్షుడు,నెట్టెం సురేష్ కమ్మ.
మహిళా విభాగం అధ్యక్షురాలు,కురువ గంగమ్మ . ఎస్సీ సెల్ అధ్యక్షుడుపూజారి ఆనంద్ ,యువజన విభాగం అధ్యక్షుడు, సురేష్ బోయ. ఎస్టీ సెల్ అధ్యక్షుడు ,చంద్ర నాయక్ .బీసీ విభాగం అధ్యక్షుడు జి. రామన్న.


Comments
Post a Comment