Skip to main content

ఏఎస్పీకే గతిలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?

 

డీజీపీ, డీఐజీ, ఎస్పీ చేతగానితనంతోనే ఈ దుస్థితి

 అనంతపురం  వై సీ పీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి 

గుత్తి, అక్టోబర్‌ 22 : 


అధికార పార్టీ నేతల అరాచకాలపై వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి పట్ల మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుత్తిలో నిర్వహించిన ‘రచ్చబండ’లో అనంత మాట్లాడారు. తాడిపత్రిలో అమరవీరుల దినోత్సవం రోజే పోలీసుల సమక్షంలోనే ‘‘రేయ్‌ ఏఎస్పీ.. ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరేవాడిని’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించడాన్ని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకే కాదు.. చివరకు ఐపీఎస్‌లకూ రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. 24 గంటలు గడిచినా డీజీపీ, డీఐజీ, ఎస్పీ స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సాక్షాత్తూ ఏఎస్పీకే గతిలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల గౌరవాన్ని పెంచుతాం.. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవీరుల దినోత్సవం రోజున ప్రసంగించారని, అదే రోజు తాడిపత్రిలో ఒరేయ్‌ ఏఎస్పీ అంటుంటే ఇక మీరేం పోలీసుల గౌరవాన్ని పెంచుతారని మండిపడ్డారు. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని గుర్తు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు చీమునెత్తురు ఉంటే.. మీరు ఐపీఎస్‌ హోదాలో ఉన్నామని అనుపించుకోవాలంటే చట్టాన్ని తన పని చేసుకోనివ్వండి. అప్పుడే మీకు గౌరవం పెరుగుతుంది. లేకపోతే సామాన్యులు కూడా మిమ్మల్ని గౌరవించరు’’ అని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు.  


*రైలు పట్టాలపై పడుకోబెడతానన్నా కేసు పెట్టరా?*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలలుగా అరాచక పాలన సాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ‘‘భూ కబ్జాలు, కల్తీ మద్యం అమ్మకాలు, ఎటుచూసినా పేకాట క్లబ్బులు.. తోటలు, లాడ్జిల్లోనూ పేకాట రాజ్యమే. పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేస్తే చివరకు ఆ బాలిక బిడ్డను ప్రసవించిన పరిస్థితి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే జర్నలిస్టులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారన్నారు. రైలు పట్టాలపై పడుకోబెడతానని బెదిరించినా ఒక్క కేసు నమోదు చేయలేదన్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మా పార్టీలోకి రండి.. వైసీపీ తరఫున నామినేషన్‌ కూడా వేయకూడదని గుంతకల్లు ఎమ్మెల్యే బెదిరిస్తే సీఎం స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఒక్కరు కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. చివరకు నిందితులను పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బయటకు తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏదైనా సమస్య వచ్చి స్టేషన్‌కు వెళితే కేసులు కూడా రిజిస్టర్‌ చేయరని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆస్తికే కాదు.. కుటుంబ సభ్యులకూ భద్రత లేదని అనంత మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...