Skip to main content

అండర్ బ్రిడ్జ్ నీటి సమస్యకు నవంబర్‌లో శాశ్వత పరిష్కారం — రైల్వే అధికారులు హామీ





ధర్మవరం, అక్టోబర్ 24:— ధర్మవరం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే సంవాద్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ప్రజలతో పాటు రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ తరపున ప్రజల తరఫున పలు ముఖ్యమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హరీష్ బాబు మాట్లాడుతూ — గత కొన్ని సంవత్సరాలుగా గాంధీనగర్, శాంతినగర్, గుట్టకిందపల్లి, ఎల్-3, ఎల్-4 కాలనీల పరిసర ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్‌లలో వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్-3, ఎల్-4 కాలనీలకు బ్రిడ్జ్ యాక్సెస్ నిర్మాణం, స్టేషన్ పరిధిలో కోచ్ మోడల్ రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, అలాగే 5వ ప్లాట్‌ఫారమ్ వద్ద టికెట్ బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. హరీష్ బాబు ప్రతిపాదనలకు ప్రతిస్పందిస్తూ, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కోఆర్డినేషన్) శ్రీనివాస్ మాట్లాడుతూ — నవంబర్ నెలాఖరుకల్లా అండర్ బ్రిడ్జ్‌లలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. అవసరమైన సాంకేతిక చర్యలు ఇప్పటికే ప్రారంభించాం అని హామీ ఇచ్చారు.

స్టేషన్ మేనేజర్ చల్లా నరసింహనాయుడు ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో అధికారులు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాల విస్తరణ, అప్రోచ్ రోడ్ల మెరుగుదల, ఆర్చ్ నిర్మాణం వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందించారు. అధికారులు ప్రజల సూచనలను స్వీకరించి, ధర్మవరం రైల్వే స్టేషన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వడానికి రైల్వే శాఖ కట్టుబడి ఉందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ నరసింహనాయుడు, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ గోనుగుంట్ల సూర్యనారాయణ, రిటైర్డ్ కమర్షియల్ సూపరింటెండెంట్ మనోహర్ గుప్తా, ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ, డాక్టర్ నరసింహులు, డి.ఆర్.యు.సి.సి. ఎక్స్ మెంబర్ బండి రాము, కమర్షియల్ సూపర్వైజర్ ముద్దన్న, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కిరణ్ కుమార్, చీఫ్ ట్రావెలింగ్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...