Skip to main content

రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం : జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, నగరపాలక సంస్థ, ట్రాఫిక్ అధికారులు జాయింట్ తనిఖీ చేసి ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలన్నారు. గుత్తి - గుంతకల్లు రోడ్ లోని రోడ్ మరియు ఆర్ఓబిని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులను ఆపేందుకు గుర్తించిన స్థలాల్లోనే మార్కింగ్ వేసి అక్కడే బస్సులు నిలిపేలా మున్సిపల్ కమిషనర్ తో సమన్వయం చేసుకొని ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసి వారు అభివృద్ధి చేసిన ఐరాడ్ యాప్ లో సిహెచ్సి మరియు ఏరియా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను డేటా ఎంట్రీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు 100 శాతం డేటా ఎంట్రీ చేయాలని, పెండింగ్ ఉండడానికి వీలులేదని, డేటా ఎంట్రీకి సంబంధించి సంబంధిత సిబ్బందికి నిత్యం శిక్షణ నిర్వహించాలన్నారు. 

జిజిహెచ్ సూపరింటెండెంట్, డిసిహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ లు వారి పరిధిలోని ఆసుపత్రులలో ఎన్ఐసి వారితో సమన్వయం చేసుకుని ఐరాడ్ యాప్ లో డేటా ఎంట్రీ నమోదు చేయించాలన్నారు. నగరంలోని తపోవనం బైపాస్ వద్ద జాతీయ రహదారిలో స్ట్రీట్ లైట్లను టౌన్ డీఎస్పీతో సమన్వయం చేసుకొని నేషనల్ హైవే వారు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలుల్ ప్రాణాలు చాలా ముఖ్యమని, వారి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ రోడ్డు భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, డిటిసి వీర్రాజు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఈఈ షాకిర్, పిఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఆర్.అండ్.బి ఈఈలు రాజగోపాల్, ప్రసాద్ రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, డిసిహెచ్ఎస్ నవీన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...