Skip to main content

సి.ఐ. రాజుపై ఆరోపణలు అవాస్తవం: స్వచ్ఛందంగానే తెదేపాలో చేరాం - ముద్దలాపురం గ్రామ ప్రజలు


ఉరవకొండ :ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామ ప్రజలు తాము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరామని, కూడేరు సీఐ రాజు తమను బెదిరించారంటూ వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇటీవల పార్టీలో చేరిన ఈ గ్రామస్థులు శుక్రవారం విలేకరులకు ఈ వివరాలు తెలిపారు.

గత కొద్ది రోజుల క్రితం ముద్దలాపురం గ్రామ ప్రజలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, గురువారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అంతపురం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, కూడేరు సీఐ రాజు తమను పోలీస్ స్టేషన్‌కు పిలిచి, ఇబ్బందులకు గురిచేసి, బెదిరించి తెలుగుదేశం పార్టీలో చేరాలని పయ్యావుల శ్రీనివాసులును కలవమని చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ముద్దలాపురం గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

అభివృద్ధిని చూసే చేరాం: కూడేరు సీఐ రాజు మమ్మల్ని పిలిచి పార్టీలో చేరాలని బెదిరించారనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేము స్వచ్ఛందంగానే ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీడీపీ పార్టీలో చేరాం" అని వారు తెలిపారు.

20 ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీలో ఉన్నా లబ్ధి లేదు: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తాము ఎస్సీ ప్రజలమని పేర్కొనడంపైనా గ్రామ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. "మేము గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్, వైసీపీ పార్టీలలో ఉన్నాం. అయినా మీ పార్టీలో మాకుగానీ, మా కుటుంబాలకు గానీ ఎటువంటి లబ్ధి పొందింది ఏమీ లేదు. మేము బీసీ కులానికి చెందిన వారము. అయినా మా కులం మీకు ఇంతవరకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మా కుటుంబాలు తెలుసుకొని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేపడుతున్న మంచి అభివృద్ధి కార్యక్రమాలను, మండలంలో, గ్రామాల్లో జరుగుతున్న పనులను చూసి, మా ఇష్టంతో, స్వతంత్రంగా పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాం" అని వివరించారు.


తప్పుడు ప్రచారం ఆపండి: 
పార్టీలో చేరే విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదని, సీఐ రాజు బెదిరించారనే ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. "మా ఇష్టంతో మేము తెలుగుదేశం పార్టీలోకి చేరాము. దీనికి పయ్యావుల శ్రీనివాసులు కానీ, కూడేరు సీఐ రాజు కానీ, మాపై ఎవరి ప్రమేయం లేదు. మమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు. అయ్యా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మాపై చిల్లర రాజకీయాలకు పాల్పడొద్దు" అని విలేకరుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పి. వెంకటేష్, పి. ధనంజయ, రమేష్, లక్ష్మీనారాయణ, హరీష్, వినయ్, భాస్కర్, లక్ష్మీదేవి, లీలావతి, జ్యోతి, అరుణ, లక్ష్మి సావిత్రమ్మ, ఓబులమ్మ, నారాయణమ్మ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...