Skip to main content

_ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు ఇంటి ముంగిటకే అందుతున్నాయి_

 అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి పెన్షన్ అందజేస్తాం_


 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో ప్రతి కుటుంబంలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది

 సూపర్ సిక్స్--సూపర్ జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 15 వేలు ఆదా అవుతుంది_

.  పెన్షన్లు--స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తెదేపా ధర్మవరం అబ్జర్వర్_ నాగేంద్ర కుమార్

ట్రూ టైమ్స్ ఇండియా:ధర్మవరం:ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తుందని ధర్మవరం నియోజకవర్గ తెదేపా పరిశీలకులు నాగేంద్ర కుమార్ అన్నారు.పెన్షన్లు పంపిణీలో భాగంగా ఆయన ధర్మవరం పట్టణం ఇందిరానగర్, పీఆర్టీ విధులలో పెన్షన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో పాల్గొన్నారు

.ఈ సందర్భంగా తెదేపా నాయకులు రాష్ట్ర ఏపీ సీడ్స్ డైరెక్టర్,రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య,పట్టణ తెదేపా అధ్యక్షుడు పరిసేసుధాకర్, మదీనా మజీద్ కమిటీ అధ్యక్షులు నాగూర్ హుస్సేన్, రామకృష్ణ, వార్డు నాయకులు ఉరుముల ఈశ్వరయ్య గుద్దిటిఅనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్,హుసేన్ మాట్లాడుతూ,గత వైసిపి ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని వెనక్కి వెళ్లిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో దేశంలోనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి,సంక్షేమంలో 4వ స్తానంలో నిలిపారని వారు పేర్కొన్నారు. 

అదేవిధంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారని, కేంద్రం జీఎస్టీ తగ్గింపుతో ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి నెలకు 15 వేల రూపాయల వరకు ఆదా అవుతోందని ఈ సందర్భంగా వారన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64 లక్షల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతినెల ఒకటో తారీఖున పెన్షన్ దారిని ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్నామని, తెలియజేశారు.వైసిపి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని తమ రోత పత్రికలో గగ్గోలు పెడుతున్నారని వైసిపి నాయకులు ప్రజలకు వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి అడిగి తెలుసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తుందో వాళ్లకు జ్ఞానోదయం కలుగుతుందని తెదేపా నాయకులు ఎద్దేవా చేశారు.

ఈసందర్భంగా ధర్మవరం పట్టణంలో గల ఇందిరానగర్,పీఆర్టీ వీధులలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను,స్మార్ట్ రేషన్ కార్డులను తెదేపా నాయకులు పంపిణీ చేశారు.

ట్రూ టైమ్స్ ఇండియా,

సంపాదకులు,

మాలపాటి శ్రీనివాసులు.

 

 

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...