Skip to main content

గత వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. కాలనీల్లోకి నీరు వస్తోంది*




 


విశ్వశాంతి నగర్ లో ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

అధికారులు కాలనీవాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే

 వచ్చే వర్షాకాలకి శాశ్వత చూపిస్తామన్న ఎమ్మెల్యే


 గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం వర్షాలకు కాలనీల్లోకి నీరు చేరుతోందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన రుద్రంపేట పంచాయతీలో ముంపుకు గురైన విశ్వశాంతి నగర్ లో పర్యటించారు. అధికారులు స్థానిక టిడిపి నాయకులతో కలసి కాలనీ మొత్తం తిరిగారు. అక్కడ ఎంత మేర నీరు వచ్చింది... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆరా తీశారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు చూపించారు. అలాగే అధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అనంతపురం నగరంలో భారీ వర్షం వచ్చి చాలా కాలనీలు నీట మునిగాయన్నారు. అప్పట్లో కొందరు వైసీపీ నాయకులు ఆక్రమణల వలన ఇబ్బందులు వచ్చాయన్నారు. వంకల్లో ఎక్కడా పూడిక తీయకపోవడం వలన కాలనీల్లోకి నీరు వచ్చిందన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నామన్నారు. వంకలకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని...త్వరలోనే అవి మంజూరవుతాయన్నారు. అకలంగా కురిసిన ఈ వర్షాలకు కాలనీలోకి నీరు వచ్చిందని.. కేవలం 50 కుటుంబాలకు మాత్రమే ఇబ్బంది కలిగిందన్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే వర్షాకాలానికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...