Skip to main content

​పెన్నహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు తక్షణ మరమ్మత్తులు చేపట్టి పూర్తి సామర్థ్యంతో నింపాలి: సీపీఐ డిమాండ్

 



​ఉరవకొండ , అక్టోబర్ 11: పెన్నహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు తక్షణమే మరమ్మత్తులు చేపట్టి, 11 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటితో నింపాలని సీపీఐ జిల్లా బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం పీఏబీఆర్ డ్యామ్‌ను పరిశీలించిన అనంతరం అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి పి. నారాయణస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దిగువ ఆయకట్టు రైతులు సాగునీరందక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ బృందంలో జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి పి. నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేశవరెడ్డి ఉన్నారు.

​రైతులకు తీరని నష్టం:

నారాయణస్వామి మాట్లాడుతూ పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీటిని అందించాల్సి ఉన్నప్పటికీ, డ్యామ్‌కు మరమ్మత్తులు చేయాలనే సాకుతో పూర్తిస్థాయి నీటిని నింపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ డ్యామ్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా దిష్టిబొమ్మగా మిగిలిపోతుందని విమర్శించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోనే ఈ డ్యామ్ ఉందని, ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని డ్యామ్‌ను పూర్తిస్థాయి నీటితో నింపి, కుడి కాలువ రైతులకు సాగునీరు అందించి చెరువులన్నింటినీ నింపాలని విజ్ఞప్తి చేశారు.

​రబీ సాగు, ఆరోగ్యశ్రీపై ఆవేదన:

రబీ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు రైతులకు సబ్సిడీ పప్పుశనగ విత్తనాలు అందించకపోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా, పేదలకు వరంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు సేవలను నిలిపివేశాయని, ప్రభుత్వం తక్షణమే బకాయి పడ్డ రూ.2,700 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​పీఏబీఆర్ డ్యామ్‌పై పర్యవేక్షణ లోపం:

జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ, పీఏబీఆర్ డ్యామ్‌లో ప్రస్తుతం ఐదు టీఎంసీల నీరు ఉన్నప్పటికీ, విద్యుత్ వినియోగానికి 520 క్యూసెక్కుల నీటిని వాడుకొని దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. 11 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన పీఏబీఆర్ డ్యామ్‌ను ఏరోజు కూడా పూర్తిస్థాయిలో నింపలేదని ఆరోపించారు. డ్యామ్‌కు ఉన్న లీకేజీలను మరమ్మత్తులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డ్యామ్‌పై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని నింపుకునేందుకు భూసేకరణ కూడా జరగలేదన్నారు. కుడి కాలువ మొత్తం శిథిలావస్థకు చేరుకుందని, కాలువకు మరమ్మత్తులు చేయకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీటిని ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులకు ఇవ్వాలన్న జీవోలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు.

​ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం:

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, చెరువులకు, కుడి కాలువకు 5 టీఎంసీలు నీటిని విడుదల చేయకపోతే సీపీఐ పార్టీ రైతుల పక్షాన పోరాటాలకు సిద్ధమవుతుందని మల్లికార్జున హెచ్చరించారు.

​కూటమి ప్రభుత్వంపై విమర్శలు:

జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 57 హామీలలో కేవలం సూపర్ సిక్స్ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందని, అందులో కూడా రైతు భరోసా, వాహన మిత్ర, ఆటో డ్రైవర్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాలను తలకెత్తుకున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి దాడికి పాల్పడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రధాన వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకొని రాజ్యాంగ విరుద్ధంగా పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి జె. మల్లికార్జున, కూడేరు మండల కార్యదర్శి నాగేంద్ర, పార్టీ నాయకులు సంగప్ప, రైతు సంఘం నాయకులు రమణ, వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...