Skip to main content

"ఆటో డ్రైవర్ల సేవలో " సభ సూపర్ సక్సెస్

హర్షం వ్యక్తం చేసిన మాజీ జడ్పీటిసి సభ్యురాలు కలివెల.జ్యోతి...
సీతారామపురం :ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపు మేరకు ఉదయగిరిలో జరిగిన “ఆటో డ్రైవర్ల సేవలో" సభ సూపర్ సక్సెస్ కావడం హర్షణీయం అని సీతారామపురం మాజీ జడ్పీటిసి సభ్యురాలు కలివెల జ్యోతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉదయగిరి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుండి అపూర్వ స్పందన కనిపిస్తూ ఉండటం ఆయన పనితీరుకు నిదర్శనం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజక పరిపాలనను సాగిస్తున్నదని కలివెల జ్యోతి కితాబునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తూ ఇది ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మంచి ప్రభుత్వం వేయినోళ్ల కీర్తించబడుతున్నదన్నారు. సూపర్ సిక్స్ పధకాలలో ప్రధానంగా మహిళల అభ్యున్నతి, ఆర్ధికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇవ్వడం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం అని కలివెల జ్యోతి తేల్చి చెప్పారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేత, తల్లికి వందనం పేరిట ఒక ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికీ వారి తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నగదును జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా మరో అద్భుతమైన పధకం ఆర్టీసీ బస్సులలో "స్త్రీ శక్తి" పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అంశమని కలివెల జ్యోతి వెల్లడించారు. మహిళల ఉన్నతికి మరింతగా తోడ్పాటును అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారనే విషయం తాజాగా వింజమూరు కేంద్రంగా జరిగిన "స్త్రీ శక్తి" విజయోత్సవ సభనిరూపణ చేసిందన్నారు. ప్రజల మనిషిగా కీర్తి ప్రతిష్టలు గడించిన

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక్క పిలుపుతో వేలాదిమంది ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా ఉప్పెనలా ఉదయగిరి కి తరలిరావడం ఉదయగిరి రాజకీయ చిత్రపటంలో చెరగని ముద్రను వేసుకున్నదన్నారు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరమైన పధకాలను క్షేత్ర స్థాయిలో వారికి అందించడం మరపురాని అంశమన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో నిరంతరం ప్రజల వృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ప్రజల మనిషి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మెట్ట ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని కలివెల జ్యోతి తెలియజేశారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...