ఢిల్లీలోని సరితా విహార్లో వృద్ధుడిపై ఓ వ్యక్తి ఇనుప రాడ్తో విచక్షారహితంగా దాడి చేశాడు. తన అక్రమ నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేశారనే అనుమానంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఓ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆ ఇద్దరిలో ఈ వృద్ధుడు ఒకడని భావించి దారుణంగా కొట్టాడు. అడ్డు చెప్పిన మహిళను కూడా బెదిరించాడు. నడిరోడ్డుపై ఈ ఘటన జరిగినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు.