కడప జిల్లా..అక్టోబర్ 18:
ముఖ్యమంత్రిని కలిసిన కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి*
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును కడప అమీన్ పీర్ దర్గా పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందించారు.
జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని... ఈ ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలకు సహకారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.

Comments
Post a Comment