కళ్యణదుర్గం:ఆంధ్రప్రదేశ్లోని పాలవెంకటాపురం గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల దేవాలయ ఆవరణలో, ఆ దేవాలయ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ లింగా రెడ్డి గారి ఆధ్యర్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (RSS) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణ్ జీ ప్రత్యేకంగా పాల్గొని దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో కళ్యాణదుర్గం BJP ఇన్ఛార్జ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మూప్పురి దేవరాజు, జిల్లా కో-కన్వీనర్ పాల బండ్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు చక్కా సుబ్రమణ్యం, మండల అధ్యక్షుడు గుడిసె పాతన్న, యువమోర్చా నాయకులు శివ తేజస్ రెడ్డి, కృష్ణ, అలాగే RSS కార్యకర్తలు తరుణ్, రఘు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, దేశ సేవ, సాంస్కృతిక విలువల పరిరక్షణలో RSS కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. కార్యక్రమం చివర్లో భగవద్గీతా పఠనం, వందేమాతరం నినాదాలతో సభ ముగిసింది.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment