Skip to main content

ఘనంగా 150వ వందేమాతరం వార్షికోత్సవ వేడుకలు


 '

ఉరవకొండ నవంబర్ 7:ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ లో 150వ వందేమాతరం వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం పంచాయతీ పాలక మండలి ఘనంగా జరుపుకొన్నారు.వేడుకల్లో భాగంగా సీనియర్, ఎలక్ట్రీషియన్క్ ఉక్కీసుల గోపాల్ సభ్యులతో సామూహికంగా ఆలపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూనేటితో

వందేమాతరం' గీతానికి 150 ఏళ్లునిండాయని తెలిపారు.

గీత ప్రాముఖ్య తను వివరించారు.

ఈ అమర గీతాన్ని బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించారుని వార్డు సభ్యులు నిరంజన్ తెలిపారు.

   ఈ గీతాన్ని నవంబర్ 7, 1875 న కూర్చారు. అందుకే, 2025 నవంబర్ 7 నాటికి ఈ గీతానికి సరిగ్గా 150 సంవత్సరాలు నిండాయని వేడుకలు జరుపుకోవడం సంతోషం అన్నారు..

  లెనిన్ బాబు మాట్లాడు తూ

 స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర 'వందేమాతరం' గీతం స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది సమరయోధులకు మనోబలాన్ని, స్ఫూర్తిని ఇచ్చే

 ఒక రణన్నినాదంగా మారిందని పేర్కొన్నారు.

 వక్తలు గోపాల్, నిరంజన్ గౌడ్, లెనిన్ బాబు లు మాట్లాడు తూ ముఖ్యంగా 1905లో జరిగిన బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం (స్వదేశీ ఉద్యమం) సమయంలో, ఈ గీతం యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ఈ కాలాన్ని చరిత్రకారులు 'వందేమాతర యుగమైందని వారు అభివర్ణించారు.

  ఈ సందర్బంగా వక్తలు ఈ గీతాన్ని మొదటగా 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారని గుర్తు చేశారు.

 జాతీయ గేయంగా గుర్తింపు

  జాతీయ గేయం: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గీతాన్ని 'జనగణమన'తో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయం గా అధికారికంగా స్వీకరించిందని అలాగే.

  ప్రపంచ గుర్తింపు: బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోల్‌లో, ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో 'వందేమాతరం' రెండవ స్థానం దక్కించుకుందని తెలిపారు.

 గీత రచన కు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టిందనారు

 అందుకే దేశ వ్యాప్తంగా సామూహిక వందేమాతర గీతం ఆలపించినట్లు వక్తలు కొనియాడారు.

  స్మారక చిహ్నాలు: ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ మరియు నాణెంను కూడా ఆవిష్కరించారుని వారు తెలిపారు.

 ఈ కార్యక్రమం లో మిగతా సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...