ప్రధాన డిమాండ్లు ఇవే
కౌలు రైతులు ప్రధానంగా ఆరు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిని తక్షణమే అమలు చేయాలని సంఘం నేతలు స్పష్టం చేశారు.
CCRC కార్డులు: క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) మంజూరు చేసే ప్రక్రియలో భూ యజమాని సంతకం నిబంధనను తొలగించాలి. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు కార్డులు జారీ చేయాలి.
E-క్రాఫ్ట్ నమోదు: సాగు చేస్తున్న కౌలు రైతులందరినీ ఈ-క్రాఫ్ట్ కింద నమోదు చేసి, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలి.
నూతన చట్టం: కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నూతన కౌలు చట్టాన్ని రూపొందించాలి.
ఎక్స్గ్రేషియా: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి.
గిట్టుబాటు ధర: కౌలు రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించి, పంట కొనుగోలు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.
'అన్నదాత సుఖీభవ' అమలు: ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీ అయిన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వాగ్దానాలు నెరవేర్చాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే తమ ఆందోళన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కౌలు రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

Comments
Post a Comment