Skip to main content

29 పార్కులకు కబ్జా నుంచి విముక్తి

శ్రీధర్‌రెడ్డిని చాలాకాలం గుర్తుంచుకొంటారు
నెల్లూరు:నగరమనే కాంక్రీట్‌ అరణ్యానికి ఊపిరితిత్తులు పార్కులే. అగ్గిపెట్టెల వంటి అపార్టుమెంట్లలో నివసించడం తప్పనిసరి అయిన రోజులలో, కాసింత గాలి పీల్చుకొనే వసతి, నాలుగడుగులు నడిచే వనరు పార్కులు మాత్రమే. అందువల్లే ఇళ్లకు లేఅవుట్‌ చేసిన ప్రతి చోటా 10 శాతం భూమి పార్కు కోసం వదలి పెట్టాలని నియమం. కానీ అదే జరగడం లేదు. ప్లాట్లు అమ్మే వరకు ఖాళీ స్థలం వుంటుంది; ఆ వెంటనే అది కూడా ప్లాట్లుగా మారిపోతుంది. గత ఇరవై ఏళ్లలో నెల్లూరు నగరంలో వేసిన రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లు కనీసం రెండు మూడు వందలుంటాయి. అంటే నగరంలో అన్ని పార్కులు కూడా వుండాలి. కానీ అక్కడొకటి, ఇక్కడొకటి తప్ప, వాటి ఆచూకే లేదు. కారణం - కబ్జా. కొన్ని ప్లాట్లు అమ్మిన వారే స్వంతం చేసుకొంటే, మరికొన్ని స్థానికంగా భుజబలం వున్న వారు కైవసం చేసుకొన్నారు. ఈ దుర్మార్గక్రమానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో కూడా ప్రయత్నం చేస్తున్నాడు.
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 29 పార్కులు గుర్తించి, కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించి, చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. మొత్తం విస్తీర్ణం 18 ఎకరాల వరకు వుంటుందని అంచనా. ఇప్పుడు నగరంలో గజం నేల బంగారుతో సమానంగా వుంది కాబట్టి, దాని విలువ ఎంతో వూహించుకోవచ్చు. 400 కోట్ల రూపాయల వరకు వుంటుందని ఒక షుమారు అంచనా. పార్కుల పరిరక్షణ కోసం ప్రహరీ గోడ కట్టించడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందట. కార్పొరేషన్‌ దాన్ని భరించింది. పార్కు స్థలాలు కాపాడడం అంత సులభం కాదు. ఆయా ప్రాంతాలలోని భుజబలులు మహా ఒత్తిడి తెస్తారు. వీధిలో ఓట్ల లెక్కన బేరం పెడతారు. డబ్బు ఎర వేస్తారు. వీలైతే, భయం కూడా సృష్టిస్తారు. అందుకే ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడడు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముందు నిలబడడం వల్ల, అధికారులు ధైర్యంగా పార్కులకు విముక్తి కల్పించగలిగారు.

ఈ 29 పార్కులతో సరిపెట్టడం కాకుండా, నగరంలోని మొత్తం పార్కు స్థలాలను గుర్తించి, స్వాధీనం చేసుకోవడం మునిసిపల్‌ అధికారులు చేయవలసిన పని. ఇళ్లతో క్రిక్కిరిసిన పాత టౌన్‌లో కూడా చాలా పార్కులు వున్నాయి. వాటికి విముక్తి కల్పిస్తే నగరంలో జన జీవనం మెరుగుపడుతుంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంచి పని చేశాడు. ఎమ్మెల్యేగా ఆయన్ను చాలాకాలం గుర్తుపెట్టుకొనే కార్యక్రమం చేపట్టాడు. అందుకాయనకు అభినందనలు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...