ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మతస్తులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మైనారిటీ ఆడపిల్లల కోసం ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యా సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
ఇమామ్లు, మౌజమ్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అదేవిధంగా, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరిపినా, ఆస్తుల సంరక్షణను మైనారిటీల ద్వారానే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి, ప్రజలు వీటిని ఆన్లైన్లో పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments
Post a Comment