Skip to main content

భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు

రష్యా


మోసాలను అరికట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం

భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారత మానవ వనరులను ఆహ్వానిస్తోంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల ప్రయోజనాలకు భద్రత లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అంచనా.

మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని స్వాగతించింది. ఇది ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఐబీఏ అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం, చైతన్యం గల వర్క్‌ఫోర్స్ భారత్‌లో ఉంది. అదే సమయంలో రష్యా పారిశ్రామికంగా కీలక దశలో ఉంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనకరం. రష్యా అవసరాలు తీరడంతో పాటు, భారత నిపుణులకు గౌరవప్రదమైన, సురక్షితమైన ఉపాధి లభిస్తుంది" అని ఆయన వివరించారు.

గతంలో కొందరు భారతీయ పౌరులు నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందులు పడిన సంఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ఐబీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ఇరు దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. రష్యాకు వెళ్లే కార్మికులకు అవగాహన, భాషా కార్యక్రమాలు నిర్వహించడం, నైతిక నియామక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది.

అలాగే మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, రష్యాలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అక్కడ పనిచేసే భారత పౌరుల సంక్షేమానికి, వారు సాఫీగా స్థిరపడటానికి పూర్తి సహకారం అందిస్తామని ఐబీఏ స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...