ప్రముఖుల సమక్షంలో వనభోజనం
ఈ మహోత్సవానికి రాజకీయ, ప్రభుత్వ రంగాల ప్రముఖులతో పాటు కమ్మ సామాజిక నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, కమ్మ సోదరులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలు సమాజానికి గర్వకారణమని కొనియాడారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మీనారాయణ సామాజిక సమగ్రత, విద్యాభివృద్ధిలో కమ్మ సంఘాల పాత్రను అభినందించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిలో: శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి – చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమ్మ కార్పొరేషన్
కోయంబత్తూర్ కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి దన మని
శ్రీ బెజవాడ వెంకట్రావు – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, APKSS
శ్రీ గరికిపాటి సుదర్శన్ నాయుడు – డైరెక్టర్, కమ్మ కార్పొరేషన్
శ్రీ మురుగొండ నాగన్న – జిల్లా అధ్యక్షులు, APKSS, అనంతపురం
ఐక్యతను చాటిన సంఘీభావం
APKSS రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెలగ కోటేశ్వర్ రావు మాట్లాడుతూ, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న కమ్మ సోదర సోదరీమణులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ తమ్మినేని రమేష్ నాయుడు, శ్రీ బండారు సుదర్శన్ నాయుడు, శ్రీ ఉప్పలపాటి నాగాంజనేయులు, శ్రీ కోనేని మల్లికార్జున, శ్రీ దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్, శ్రీ సందిరెడ్డి వెంకటరమణ తదితర ప్రముఖులు తమ సామాజిక బాధ్యతను వివరించారు.
APKSS సభ్యులు, వివిధ కమ్మ సంఘాల అధ్యక్షులు, మరియు కమ్మ సోదర సోదరీమణులు వేలాదిగా ఈ వనభోజనంలో పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వేదికల ద్వారా సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.


Comments
Post a Comment