![]() |
| చిత్తూరు కలెక్టర్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ ఫిర్యాదు: మీడియా పట్ల దురుసు ప్రవర్తనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మొర |
మీడియా స్వేచ్ఛకు భంగం: కలెక్టర్ తీరు పత్రికా స్వేచ్ఛను అణచివేసే విధంగా ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కలెక్టర్ అగౌరవపరచారని ఫిర్యాదులో తెలిపారు.
క్రమశిక్షణా చర్యలు డిమాండ్: కలెక్టర్ సుమిత్ కుమార్ పైన తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్ ని కోరారు.
ఫిర్యాదు చేసిన బృందం ఈ సందర్భంగా కే రామకృష్ణతో పాటు విశాలాంధ్ర డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు, ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి బాల కాశి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. కలెక్టర్ వ్యవహారశైలిపై వారు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సంఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించి కలెక్టర్ పై క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని ఉరవకొండ సీనియర్ పాత్రికేయులు మాలపాటి శ్రీనివాసులు, డీ బాల చంద్ర నాయుడు, మీనుగ మధు బాబు, వెంకటేష్, బాల రాజు విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ ను డిమాండ్ చేశారు.
