Skip to main content

ముఖ్యమంత్రి ఫోటో మాయం, పయ్యావుల కేశవ్ చిత్రపటం దర్శనం!

 ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో వి'చిత్ర' దృశ్యం: 

ఉరవకొండ  :రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చిత్రపటాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం బేఖాతరు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చిత్రపటాలు లేకపోగా, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాన్ని ఒక కార్యకర్త చొరవతో కార్యాలయంలో ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

పరిస్థితి దర్పణం: తహసీల్దార్ కార్యాలయం గోడపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటం దర్శనమిచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని అధికారులు ఏర్పాటు చేయలేదని, ఒక కార్యకర్త స్వయంగా తెచ్చి వితరణ చేయడంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

  అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి చిత్రపటాలు పూర్తిగా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

పౌరులు మరియు పార్టీ శ్రేణులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ప్రభుత్వం మారినా రెవెన్యూ అధికారుల్లో మార్పు లేదు. 'అవును మేమింతే, మేము మారం అంతే' అనే చందంగా వారి తీరు మారింది," అని వారు విమర్శిస్తున్నారు.

 ప్రభుత్వ ఆదేశాల బేఖాతరు:

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరియు స్థానిక మంత్రుల ఫొటోలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.ఈ ఆదేశాలను ఉరవకొండ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

పార్టీ శ్రేణుల డిమాండ్ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ, అధికారిక చిత్రపటాలను ఏర్పాటు చేయని అధికారులపై ప్రభుత్వం వెంటనే శాఖా పరమైన చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అధికారుల ఈ ధోరణి అధికార పార్టీకి చెడ్డపేరు తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని ప్రశ్నించేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...