ఈరోజు అనంతపురం నగరంలో పర్యటించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నగర విభాగం కార్యదర్శి ఇమ్రాన్ ప్రత్యేకంగా కలిసి మర్యాదపూర్వకంగా పలకరించారు.
ఈ సందర్భంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమం, సంతకాల సేకరణ పురోగతి గురించి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నాయకులతో చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు కోనిరెడ్డి అశోక్ కుమార్, ఇమ్రాన్, వంశీ, నాగేంద్ర మరియు వైఎస్ఆర్సీపీ నగర ప్రచార విభాగం కార్యదర్శి నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
